ఎంతవరకూ నిజమో తెలీదు కానీ మనకి అందుతున్న సమాచారం ప్రకారం ఎక్స్ ప్రెస్ రాజా ప్రొడ్యూసర్ లు వంశీ – ప్రమోద్ లని వారి క్లోజ్ ఫ్రెండ్ ప్రభాస్ తిట్టాడు అని తెలుస్తోంది.యూవీ క్రియేషన్స్ కి అధినేతలు అయిన వీరిద్దరూ ప్రభాస్ కి ప్రాణ స్నేహితులు.
ప్రభాస్ తిట్టడానికి కారణం లేకపోలేదు.జనవరి 14 న ఎక్స్ ప్రెస్ రాజా సినిమా విడుదల చేయ్యడానికి పూనుకోవడ౦ వారు చేసిన తప్పు అంటున్నారు.
నెలన్నర నుంచీ సంక్రాంతి రేసులో యూవీ వారి సినిమా ఉంది అని వార్తలు వస్తూనే ఉన్నాయి.కానీ ఆఖరి నిమిషం లో చిన్న సినిమా కాబట్టి వారు తప్పుకుంటారు అని అనుకున్నారు అందరూ, కానీ అలాంటిది ఏమీ జరగకుండా విడుదల కి సిద్దం చేసేసారు.
ప్రభాస్ కి చెప్పకుండా విడుదల తేదీ ఫిక్స్ చేయడం వల్లనే ఈ గొడవ వచ్చింది అని కొందరు అంటూ ఉంటె మరి కొందరు మాత్రం ప్రభాస్ కు చెప్పకుండా వారు ఆ డేట్ ను అయితే ఫిక్స్చేసుండరు.ఒకవేళ యువి వారు రేసులో ఉన్నారని ప్రభాస్ మీద బాగా ఒత్తిడి రావడంతో.
ఇలాంటి రూమర్లు సన్నిహితులే పుట్టించి ప్రభాస్ పై ప్రెజర్ తగ్గిస్తున్నారని అంటున్నారు.