కె.జి.ఎఫ్ తో సూపర్ హిట్ అందుకున్న ప్రశాంత్ నీల్ ఆ సినిమా సీక్వల్ తో మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు.కె.జి.ఎఫ్ 2 షూటింగ్ పూర్తి కాగా రిలీజ్ కు రెడీ అవుతుంది.ఇక లేటెస్ట్ గా ప్రభాస్ తో సలార్ సినిమా చేస్తున్న ప్రశాంత్ నీల్ ఈ సినిమాను కూడా భారీగా ప్లాన్ చేస్తున్నాడు.కె.జి.ఎఫ్ నిర్మాతలే ప్రభాస్ సలార్ సినిమాను నిర్మిస్తున్నారు.ఇదిలాఉంటే ప్రభాస్ సలార్ సినిమాలో మళయాళ స్టార్ పృధ్విరాజ్ సుకుమారన్ కూడా నటిస్తున్నాడని లేటెస్ట్ టాక్.మళయాళంలో అతను వరుస సూపర్ హిట్లతో స్టార్ క్రేజ్ తెచ్చుకున్నాడు.
అలాంటి పృధ్విరాజ్ ను సలార్ లో పెట్టి సినిమాపై మరింత అంచనాలు పెంచాడు డైరక్టర్ ప్రశాంత్ నీల్.సలార్ సినిమాలో పృధ్విరాజ్ అనగానే సినిమా మల్టీస్టారర్ సినిమాగా మారింది.
అంతేకాదు సినిమాలో పృధ్విరాజ్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తారని తెలుస్తుంది.తప్పకుండా సలార్ సినిమాకు పృధ్విరాజ్ చాలా ప్లస్ అవుతాడని చెప్పొచ్చు.
ఇక ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా కె.జి.ఎఫ్ భామ నిధి శెట్టి కూడా స్పెషల్ సాంగ్ లో కనిపిస్తుందని అంటున్నారు. ప్రభాస్, పృధ్విరాజ్ ల సీన్స్ సినిమాకే హైలెట్ గా నిలుస్తాయని అంటున్నారు.