టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ముందు నుండి చేసుకున్న ప్లానింగ్స్ అన్ని కరోనా కారణంగా ఆవిరి అయిపోయాయి.సాహో సినిమా విడుదల అయ్యి రెండు సంవత్సరాలు అవుతున్న ఇప్పటి వరకు మరొక సినిమాను థియేటర్స్ కు తీసుకురాలేదు ప్రభాస్.
అందుకే ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఈ విషయంలో నిరాశ చెందారు.సాహో తర్వాత వెంటనే రాధే శ్యామ్ సినిమా మొదలు పెట్టాడు.
ఆ తర్వాత కూడా వరుస సినిమాలు ప్రకటించాడు.అన్ని బాగుంటే ఈ పాటికే రాధేశ్యామ్ సినిమా విదుల్ అయ్యి ఉండేది కానీ కరోనా కారణంగా షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తుంది.
మళ్ళీ కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఈ మధ్యనే ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా షూట్ ను మొదలు పెట్టాడు.అయితే ఈ సినిమాతో పాటు ప్రభాస్ కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్సినిమా, ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమా కూడా చేస్తున్నాడు.
ఈ రెండు సినిమాలు ఇప్పటికే కొద్దీ భాగం షూట్ ను పూర్తి చేసుకున్నాయి.కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా అన్ని సినిమాలతో పాటుగా ఈ సినిమాలు కూడా వాయిదా పడ్డాయి.అయితే ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా త్వరగా పూర్తి చేసి జులై లోనే సలార్ సినిమా షూట్ కూడా స్టార్ట్ చేయబోతున్నాడని అనుకుంటున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి.
అయితే ఇప్పుడు సలార్ షూటింగ్ జులై నుండి ఆగస్టుకు షిఫ్ట్ అయినట్టు తెలుస్తుంది.మరి మరింత సమాచారం తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి ఉండాల్సిందే ఇది ఇలా ఉంటే ప్రశాంత్ నీల్ ఈ సినిమాను ఉగ్రం సినిమాకు రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.
హోంబళ్లే ప్రొడక్షన్ బ్యానర్ పై విజయ్ కిరగందుర్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.