యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలు లైన్ లో పెట్టాడు.వాటిలో కేజీఎఫ్ సినిమాతో స్టార్ దర్శకుడుగా మారిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా ఒకటి.
ఈ సినిమా షూటింగ్ కూడా ఇప్పటికే ప్రారంభమైంది.మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది.
భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ ఓ మాఫియా లీడర్ కి నమ్మినబంటుగా ఉంటాడని, అలాంటి పొజిషన్ నుంచి మాఫియా డాన్ గా ఎలా ఎదిగాడు అనే స్టొరీతో సినిమా తెరకెక్కుతుంది.ఇక ఈ సినిమాలో శ్రుతి హసన్ హీరోయిన్ గా నటిస్తుంది.
ఇదిలా ఉంటే గత కొద్ది రోజులుగా ఈ సినిమాపై రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి.ఈ సినిమాని ఓ హాలీవుడ్ మూవీ స్ఫూర్తితో రెడీ చేస్తున్నారని టాక్ నడిచింది.
అలాగే ప్రశాంత్ నీల్ కన్నడంలో తెరకెక్కించిన మొదటి సినిమా ఉగ్రంకి రీమేక్ గానే ఈ మూవీ ఉండబోతుంది అనే మాటలు కూడా వినిపించాయి.
అయితే దర్శకుడు ప్రశాంత్ నీల్ మాత్రం మొదటి నుంచి ఈ సినిమా పూర్తిగా కొత్త కథతో కథతో తెరకెక్కుతుందని, ప్రభాస్ ని దృష్టిలో ఉంచుకొని సలార్ కథని సిద్ధం చేసుకున్నట్లు చెప్పుకొచ్చాడు.
లాక్ డౌన్ టైంలో ఈ కథని రెడీ చేసినట్లు కూడా టాక్ నడిచింది.అందరూ అనుకున్తున్నలు ఇది ఉగ్రం మూవీ రీమేక్ కాదని కూడా స్పష్టం చేశాడు.
దీంతో సలార్ మూవీ కొత్తకథతో ప్రశాంత్ నీల్ ఆవిష్కరిస్తున్నారని అనుకున్నారు.అయితే తాజాగా ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్న రవి బస్సూర్ మీడియాలో నోరు జారి సలార్ గురించి అసలు విషయం బయటపెట్టేశాడు.
ఉగ్రం సినిమాకి రీమేక్ గానే ఈ మూవీ తెరకెక్కుతుందని, ప్రభాస్ ఇమేజ్, పాన్ ఇండియా స్టాండర్డ్ ని దృష్టిలో ఉంచుకొని కొన్ని మార్పులు చేసినట్లు చెప్పేశాడు.దీంతో సలార్ మూవీ గురించి అసలు విషయం బయటపడిందని ఇప్పుడు టాక్ నడుస్తుంది.