యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ మూవీ పట్టాలెక్కబోతుంది అంటూ ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది.సినిమా షూటింగ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
షూటింగ్ ప్రారంభోత్సవం గురించి ఎంతో ఆసక్తి గా ఎదురు చూసిన అభిమానులకు ప్రతి ఒక్కరికి సంతోషాన్ని కలిగించేలా పండుగ సందర్బంగా సలార్ మూవీని పట్టాలెక్కించారు.యశ్ ముఖ్య అతిథిగా వచ్చిన ఈ ప్రారంబోత్సవం పై జాతీయ మీడియాలు సైతం కథనాలు రాస్తున్నాయి.
ఈసమయంలోనే సినిమా విడుదల గురించి జనాలు ప్రశ్నిస్తున్నారు.ఆది పురుష్ ను వచ్చే ఏడాది ఆగస్టులో అంటూ క్లీయర్ గా దర్శకుడు ఓం రౌత్ క్లారిటీ ఇచ్చాడు.
కనుక సలార్ మూవీ ఎప్పుడు అనేది ప్రశాంత్ నీల్ కూడా క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ను సమ్మర్ లో ప్రారంభించే అవకాశం ఉంది అంటున్నారు.
కేజీఎఫ్ 2 సినిమా ప్రేక్షకుల ముందుకు రాకముందే సలార్ సినిమాను పట్టాలెక్కించడం సాధ్యమేనా అనేది కొందరి అనుమానం.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది.
ప్రభాస్ ను ప్రశాంత్ నీల్ ఎలా చూపించబోతున్నాడు అనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో కూడా ఉంది.తప్పకుండా ఓ రేంజ్ లో ఈ సినిమా ఉంటుందని ప్రతి ఒక్కరు ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు.
పాన్ ఇండియా మూవీ అంటే ఇది అన్నట్లుగా అభిమానులు సైతం ఆసక్తిగా ఉన్నారు.ఇంతటి ఆసక్తి ఉన్న సినిమా విడుదల ఎప్పుడు అనే విషయంలో క్లారిటీ రావడం లేదు.
ఈ సినిమా హీరోయిన్ ఎవరు విలన్ ఎవరు అనే విషయంలో కూడా ఇంకా ఎలాంటి స్పష్టతను మేకర్స్ ఇవ్వలేదు.