యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ వరస పెట్టి పాన్ ఇండియా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి.
అందులో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటిస్తున్న సలార్ సినిమా ఒకటి.ఈ సినిమాను ఉగ్రం సినిమాకు రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు.
సలార్ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే అధికారికం గా ప్రకటించారు.
ప్రభాస్ తొలిసారి శృతి హాసన్ తో నటిస్తున్నాడు.
శృతి హాసన్ ఈ సినిమాలో జర్నలిస్ట్ గా నటిస్తుంది.హోంబళ్లే ప్రొడక్షన్ బ్యానర్ పై విజయ్ కిరగందుర్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
ఈ సినిమా ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుంది.ఈ సినిమాను ప్రశాంత్ నీల్ హై ఓల్టేజ్ యాక్షన్ సినిమాగా తెరకెక్కిస్తున్నాడు.
ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అవ్వడంతో ఆయన సినిమాలు సెట్స్ మీద ఉండగానే అప్పుడే బిజినెస్ కూడా స్టార్ట్ అయ్యింది.
ఈ సినిమా ఇంకా సెట్స్ మీద ఉండగానే థియేట్రికల్ హక్కుల కోసం అప్పుడే డిస్టిబ్యూటర్లు మధ్య పోటీ నెలకొంది.ఆ పోటీతో పాటు ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు కోసం కూడా అప్పుడే బేరసారాలు మొదలయ్యాయని తెలుస్తుంది.అమెజాన్ ప్రైమ్ భారీ మొత్తం చెల్లించడానికి కూడా రెడీ అయ్యిందట.
ఇంతకు ముందు ఎప్పుడూలేని అంత పెద్ద మొత్తం చెల్లించి సొంతం చేసుకునేందుకు కూడా రెడీగా ఉందట.
కానీ ప్రస్తుతానికి ఈ విషయంలో ఇంకా చర్చలు జరుగుతున్నాయని ఇంకా ఓకే అవ్వలేదని టాక్ వినిపిస్తుంది.మొత్తానికి ప్రభాస్ మార్కెట్ ఒక రేంజ్ లో ఉందనేది మరొకసారి రుజువవ్వబోతుంది.ఇది ఇలా ఉంటే ప్రభాస్ ఈ సినిమాతో పాటు రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ సినిమా, ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమాలు చేస్తున్నాడు.
ఈ సినిమాలతో పాటు నాగ్ అశ్విన్ తో కూడా ఒక సినిమా లైన్లో పెట్టాడు.