యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా సూపర్ స్టార్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఆయన బాహుబలి మరియు సాహో సినిమాలు ఆయన్ను ఆకాశాన నిలిపాయి.
ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల సంఖ్య భారీగా ఉంది.ఈ ఏడాదిలో రాధే శ్యామ్ మరియు వచ్చే ఏడాదిలో ప్రభాస్ సలార్ సినిమా లు విడుదలకు సిద్దంగా ఉన్నాయి.
థియేట్రికల్ రైట్స్ మరియు ఓటీటీ రైట్స్ ద్వారా ఈ రెండు సినిమాలకు వచ్చే మొత్తంను చూస్తే మన ప్రభాస్ రేంజ్ ఏంటో ఈజీగా తెలిసి పోతుంది.సినిమా లకు ఉన్న బజ్ నేపథ్యంలో కేవలం ప్రీ రిలీజ్ బిజినెస్ ఏకంగా వెయ్యి కోట్ల రూపాయలకు పైగా అవుతుందని అంచనా.
ప్రస్తుతం అంచనా మేరకు ఆ మొత్తం చెబుతున్నారు.ఒకటి రెండు నెలలు ఆగితే సినిమా థియేటర్లు పునః ప్రారంభం అయ్యి జనాలు క్యూలు కడితే ఖచ్చితంగా ఈ మొత్తం పెద్ద ఎత్తున పెరిగే అవకాశౄలు ఉన్నాయి.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం రాధే శ్యామ్ సినిమా కోజం జీ5 వారు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారట.ఈ విషయంలో వారు చేస్తున్న ఇస్తున్న ఆఫర్ అంతా ఇంతా కాదు.థియేట్రికల్ రైట్స్ తో పాటు వారు ఓటీటీ రైట్స్ ను కూడా కొనుగోలు చేస్తామని ముందుకు వస్తున్నారు.500 కోట్లకు అటు ఇటుగా జీ 5 వారు ఆఫర్ ఇచ్చారని తెలుస్తోంది.
షూటింగ్ ముగించిన తర్వాత బిజినెస్ ను క్లోజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.ఇక సలార్ సినిమా విషయమై అమెజాన్ వారు ఇప్పటికే రెండు మూడు దఫాలుగా చర్చలు జరిపారని తెలుస్తోంది.షూటింగ్ ఇంకా సగం కూడా కాని ఈ సినిమా కు అప్పుడే అయిదు వందల కు పైగా ఆఫర్ వచ్చింది అంటే సినిమా కు ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.రికార్డు బ్రేకింగ్ వసూళ్లను ఈ రెండు సినిమా లు వసూళ్లు చేసుకుంటాయనే నమ్మకం అందరిలో వ్యక్తం అవుతోంది.
మరి ఈ సినిమా లను థియేటర్ల విడుదల చేస్తారా లేదా ఓటీటీ నా అనే విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.