టాలీవుడ్ పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ గురించి తెలినోలే లేరు.ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్.
టాలీవుడ్ లో ఇతర పరిశ్రమల స్టార్ డైరెక్టర్ల తో ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాడు.అంతేకాకుండా తన సినిమాలో ఎక్కువగా బాలీవుడ్ హీరోయిన్స్ నటిస్తున్నారు.
ఎంతోమంది బాలీవుడ్ డైరెక్టర్లు, హీరోయిన్స్ ప్రభాస్ కాంబినేషన్ లో నటించడానికి తెగ ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉంటే ప్రభాస్ కొన్ని విషయాలను అభిమానులతో పంచుకోగా.
ఆయనకు తాను సినిమాలలో రాకముందు జయసుధ, శ్రేయ, త్రిష అంటే ఎంతో అభిమానం అని తెలిపాడు.హీరోలలో షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, రాబర్ట్ డి నీరో అంటే ఎంతో ఇష్టమని తెలిపాడు.
ఇదిలా ఉంటే ప్రభాస్ మొదటి నుంచి చాలా బద్ధకం ఉండేదట.అదే తనకున్న పెద్ద బలహీనత అని.దాని వల్ల చాలా నష్టపోయానని తెలిపాడు ప్రభాస్.
తీరిక దొరికినప్పుడల్లా ఇంట్లో వాతావరణంతో గడుపుతారట.
ఇక తనకు చిన్నప్పటి నుంచి హోటల్ రంగంలో వెళ్లాలని ఉండేదట.కానీ అనుకోకుండానే సినీ పరిశ్రమలో అడుగుపెట్టానని తెలిపాడు.
ఇక బాహుబలి సినిమా కోసం బరువు పెరగడానికి ప్రతిరోజు 40కిపైగా గుడ్లు తినేవాడట.
అంతేకాకుండా తనకు ఎంతో ఇష్టమైన బిర్యానీని కనీసం 15 రకాలు తెప్పించుకొని తినేవాడట.ఇక బాహుబలి సినిమా కోసం జిమ్ కూడా ఒక భాగమే అని.ఇంట్లోనే ఒకటిన్నర కోట్ల రూపాయలతో జిమ్ము ని ఏర్పాటు చేసుకున్నాడట.
ఇక తనకు లండన్, ప్యారీస్, దుబాయ్ వంటి ప్రదేశాలు చాలా ఇష్టమని.ఓ నాలుగు రోజులు ఎక్కడికి వెళ్లిన ఇంటికి వచ్చేవరకు.ఇంతకు మించిన చోటు మరొకటి లేదని తెలిపాడు.అంతేకాకుండా షూటింగ్ సమయంలో కూడా ఏ ప్రాంతంలో ఉన్న వీలైనంత త్వరగా ఇంటికి వచ్చెయాలనుకుంటాడట.
ఇక తన చిన్నతనంలో తన బాబాయ్, తన నాన్న ఏదైనా సినిమా విడుదలకు ముందు శ్రీశైలానికి వెళుతూ తనని కూడా తీసుకువెళ్లేవారట.ఇప్పటికీ తను కుదిరినప్పుడల్లా శ్రీశైలానికి వెళ్లి వస్తాడట.
ఇక ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్, సలార్, ఆది పురుష్ పాన్ ఇండియా సినిమాలలో బిజీగా ఉండటమే కాకుండా మరికొన్ని అవకాశాలు కూడా అందుకుంటున్నాడు.