తెలుగులో బాహుబలి చిత్రం ద్వారా తెలుగు సినిమాలను అంతర్జాతీయ స్థాయి కి పరిచయం చేసిన టాలీవుడ్ యంగ్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ గురించి కొత్తగా సినీ ప్రేక్షకులకు తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే ప్రభాస్ నటించింది తక్కువ సినిమాలే అయినా ఎక్కువ క్రేజ్ మరియు అభిమానుల ఫాలోయింగ్ సంపాదించుకున్నాడని అనడంలో ఎటువంటి సందేహం లేదు.
అంతేగాక తెలుగులో బాహుబలి, బాహుబలి – 2, సాహో వంటి భారీ బడ్జెట్ చిత్రాలలో నటించి తన నటనా ప్రతిభ ఏంటో చూపించాడు.అయితే తన సినిమాల బడ్జెట్ తరహాలోనే ఈ మధ్యకాలంలో ప్రభాస్ రెమ్యూనరేషన్ కూడా భారీగానే తీసుకుంటున్నట్లు సమాచారం.
అయితే ఇందులో ప్రభాస్ ఒక చిత్రంలో నటించాలంటే దాదాపుగా ప్రస్తుతం 40 నుంచి 50 కోట్ల రూపాయలు పారితోషకం తీసుకుంటున్నాడట.ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ప్రభాస్ టాలీవుడ్ యంగ్ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.
కాగా ఈ చిత్రంలో నటించేందుకుగానూ ప్రభాస్ దాదాపుగా 100 కోట్ల రూపాయలకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ తరహాలో ఉండడంతో ఈ చిత్రాన్ని దేశంలో ప్రాముఖ్యత కలిగినటువంటి అన్ని భాషల్లోనూ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడని అందువల్లనే ఈ చిత్రంలో నటించడానికి ప్రభాస్ వంద కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడని పలు కథనాలు వినిపిస్తున్నాయి.
ఈ పారితోషికం విషయం పై వస్తున్నటువంటి వార్తలపై ఇప్పటి వరకు ప్రభాస్ గాని లేదా ఇతర చిత్ర యూనిట్ సభ్యులు గాని స్పందించలేదు. దీంతో ఈ వార్తలలో నిజం ఎంత ఉందనేది ఇంకా తెలియాల్సి ఉంది.
కాగా సౌత్ ఇండియా సినిమా పరిశ్రమలో ఇప్పటి వరకు అత్యధికంగా సూపర్ స్టార్ రజనీకాంత్ 60 నుంచి 75 కోట్ల రూపాయల పారితోషకం అందుకున్నాడు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రముఖ దర్శకుడు కేకే రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్న “రాధే శ్యామ్” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.
ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పలు కీలక సన్నివేశాల చిత్రీకరణ పనులు కూడా పూర్తయినట్లు సమాచారం.