యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాతో ఏ హీరోకు లేనంత స్టార్ డమ్ వచ్చేసింది.ఇప్పుడు ప్రభాస్ రేంజ్ మారిపోయిందనే చెప్పాలి.
బాహుబలి ముందు ప్రభాస్ బాహుబలి తర్వాత ప్రభాస్ కు చాలా మార్పులే వచ్చాయి.ఇప్పుడు అన్ని భారీ బడ్జెట్ తో హై వోల్టేజ్ యాక్షన్ సినిమాలను తీస్తూ అభిమానులను సంతోష పెడుతున్నాడు.
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి.
అన్ని సినిమాల బడ్జెట్ 100 కోట్ల పైమాటే.
ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాధేశ్యామ్‘ సినిమా 150 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నట్టు తెలుస్తుంది.ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.
ఈ సినిమాలో ప్రభాస్ కు జంటగా పూజ హెగ్డే నటిస్తుంది.ఈ సినిమా సంక్రాంతి సీజన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇక ప్రభాస్ కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది.
ఈ సినిమాలో శృతి హాసన్ ప్రభాస్ కు జంటగా నటిస్తుంది.ఈ సినిమా కోసం నిర్మాతలు 200 నుండి 300 కోట్ల వరకు బడ్జెట్ పెడుతున్నట్టుగా సమాచారం.
ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 30 శాతం వరకు పూర్తి చేసుకుంది.ఇక ఆ తర్వాత ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణం నేపథ్యంలో ఆదిపురుష్ సినిమా తెరకెక్కుతుంది.
ఈ సినిమాను టి సిరీస్ సంస్థ 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా నటిస్తున్నారు.
ఈ సినిమాను విజువల్ వండర్ గా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ లో ప్రభాస్ ప్రస్తుతం బిజీగా ఉన్నాడు.
ఈ సినిమాలతో పాటు ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ వరల్డ్ సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమా బడ్జెట్ కూడా 500 కోట్ల పైమాటే.
ఈ నాలుగు సినిమాల బడ్జెట్ సుమారు 1600 కోట్లు ఉంటుందని మాట్లాడు కుంటున్నారు.అయితే ఈ నాలుగు సినిమాలకు ప్రభాస్ రెమ్యునరేషన్ వింటే కళ్ళు తిరగాల్సిందే.ప్రస్తుతం ప్రభాస్ ఒక సినిమాకు సుమారు 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు టాక్.అంతేకాదు ఏరియా వైజ్ హక్కులు కూడా చేజిక్కించు కుతున్నట్టు టాక్.మరి ఈ నాలుగు సినిమాల ప్రభాస్ రెమ్యునరేషన్ 500 కోట్ల పైమాటే అని గుసగుసలు వినిపిస్తున్నాయి.ఇంత పెద్ద మొత్తం అందుకుంటున్న మరొక హీరో ఎవ్వరు లేనట్టు సినీ ఇండస్ట్రీలో అనుకుంటున్నారు.