టాలీవుడ్ స్టార్ హీరోలలో ప్రభాస్ ఒకరనే సంగతి తెలిసిందే.తన ప్రతిభతో, నటనతో పాన్ ఇండియా హీరోగా ఇమేజ్ ను సొంతం చేసుకున్న ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా కథలలోనే నటిస్తూ విజయాలను సొంతం చేసుకుంటున్నారు.
అయితే ప్రభాస్ కేవలం ఏడాది కాలంలో 150 కోట్ల సంపాదన వదులుకున్నారని సమాచారం.టాలీవుడ్ స్టార్ హీరోలు మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్ టీవీ యాడ్స్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.
టీవీ యాడ్స్ ద్వారా ఆయా హీరోలకు కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది.అయితే ప్రభాస్ మాత్రం టీవీ యాడ్స్ లో అస్సలు కనిపించరు.ప్రభాస్ కు ప్రముఖ కంపెనీల బ్రాండ్ ఎండార్స్ మెంట్ ఆఫర్లు వచ్చాయని ఆ ఆఫర్లను ప్రభాస్ రిజెక్ట్ చేశారని తెలుస్తోంది.దుస్తుల కంపెనీలు, ఎలక్ట్రానిక్ కంపెనీలతో పాటు ఎఫ్.
ఎం.సీ.జీ కంపెనీలు సైతం ప్రభాస్ ను తమ బ్రాండ్ ప్రమోషన్స్ చేయాలని కోరాయి.
అయితే ప్రభాస్ మాత్రం కోట్ల రూపాయల ఆఫర్లు వచ్చినా ఆ ఆఫర్లను సున్నితంగా రిజెక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది.అయితే ప్రభాస్ ఎందుకు బ్రాండ్ ప్రమోషన్స్ చేయడానికి నిరాకరిస్తున్నారనే ప్రశ్నకు సరైన కారణం మాత్రం దొరకడం లేదు.ప్రభాస్ టీవీల్లో యాడ్స్ లో కూడా కనిపించాలని ఆయన ఫ్యాన్స్ మాత్రం కోరుకుంటున్నారు.
మరోవైపు ప్రభాస్ సినీ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు.
టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం సత్తా చాటాలని ప్రభాస్ అనుకుంటున్నారు. ప్రభాస్ ప్లాన్స్ అనుకున్నవి అనుకున్న విధంగ నెరవేరతాయో లేదో చూడాల్సి ఉంది.బాహుబలి సినిమా ప్రమోషన్ సమయంలో రాజమౌళి ప్రభాస్ బ్రాండ్ ఎండార్స్ మెంట్లను వదులుకున్నారని చెప్పిన సంగతి తెలిసిందే.
ప్రభాస్ ప్రస్తుతం మూడు సినిమాలలో నటిస్తుండగా త్వరలో రాధేశ్యామ్ మూవీ రిలీజ్ కానుంది.