యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఓ వైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ మూవీ చేస్తున్నాడు.మరో వైపు ఓం రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్ సినిమా చేస్తున్నాడు.
రెండు భిన్నమైన జోనర్స్ లో తెరకెక్కుతున్న సినిమాలు అయినా కూడా పెర్ఫెక్ట్ షెడ్యూల్ ప్లాన్ చేసుకొని షూటింగ్ లు చేయడానికి రెడీ అయ్యాడు.ఇప్పటికే సలార్ సినిమాకి సంబందించిన పదిరోజుల షెడ్యూల్ ని ప్రభాస్ పూర్తి చేశాడు.
ఈ షెడ్యూల్ లో యాక్షన్ ఎపిసోడ్స్ ని షూట్ చేశారు.ఇదిలా ఉంటే మరో వైపు ఆది పురుష్ సినిమా షూటింగ్ కూడా ఇప్పటికే ప్రారంభమైంది.
ఈ సినిమాని కంప్లీట్ గా గ్రీన్ మ్యాట్ లో మోషన్ క్యాప్చర్ విధానంలో షూట్ చేస్తున్నారు.ఈ నేపధ్యంలో ఇప్పటికే దర్శకుడు ఓం రౌత్ షూటింగ్ స్టార్ట్ చేసి యాక్షన్ ఎపిసోడ్స్ ని చిత్రీకరిస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ లో ప్రభాస్ జాయిన్ అవ్వబోతున్నట్లు తెలుస్తుంది.
మార్చి మొదటి వారంలో ప్రభాస్ ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతాడని తెలుస్తుంది.
ఇక రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఆది పురుష్ మూవీలో రాముడు పాత్రలో ప్రభాస్ కనిపించబోతున్నాడు.దానికోసం మీషాలు పెంచి కొత్త లుక్ లోకి యంగ్ రెబల్ స్టార్ మారిపోయాడు.
ఇక శ్రీరాముడు తల్లి కౌశల్యదేవి గా వెటరన్ స్టార్ హీరోయిన్ హేమమాలినీ కనిపించబోతుంది.ఇక సీత పాత్రలో కృతి సనన్ ఫైనల్ చేసారని టాక్ వినిపిస్తున్న అధికారికంగా కన్ఫర్మ్ కాలేదు.
మార్చి ఫస్ట్ వీక్ నుంచి ప్రభాస్ కి సంబందించిన సన్నివేశాలని ఏకదాటి మీద షూట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది.