యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ చిత్రం కోసం ప్రేక్షకులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ను షేక్ చేసేందుకు ప్రభాస్ రెడీ అవుతుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు.
ఇక ఈ సినిమాను పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.కాగా ఈ సినిమా నుండి కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్ మాత్రమే రిలీజ్ చేయడంతో ఈ సినిమాకు సంబంధించి ఇతర ఏ అప్డేట్ కూడా లేకపోవడంతో ప్రేక్షకులు నిరాశకు లోనవుతున్నారు.
కాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ను త్వరలోనే రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.అయితే ఒకేసారి రెండు అప్డేట్లు ఇచ్చేందుకు ప్రభాస్ అండ్ టీమ్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
టీజర్తో పాటు ఈ సినిమా రిలీజ్ డేట్ను కూడా అనౌన్స్ చేసేందుకు రాధేశ్యామ్ చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.టీజర్ను రిలీజ్ చేసే సమయంలోనే రిలీజ్ డేట్ను కూడా అనౌన్స్ చేస్తే సినిమాపై హైప్ క్రియేట్ అవుతుందని వారు భావిస్తున్నారు.
ఇక ఈ సినిమాలో ప్రభాస్ వింటేజ్ లుక్తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమాలో ప్రభాస్ సరసన అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది.
ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అటు ప్రేక్షకులతో పాటు సినీ వర్గాలు కూడా ఎంతో ఆసక్తిగా చూస్తు్న్నాయి.ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్తో యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి.
మరి ఈ సినిమా నుండి డబుల్ ట్రీట్ ఎప్పుడు ఉండబోతుందో చూడాలి.