కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తున్న విషయం తెలిసిందే.ఇప్పుడు అందుకే ఎక్కడ చూసినా కూడా మాస్క్ లు లేకుండా ఎవరూ కనిపించడం లేదు.
ఇంటిలో నుంచి బయటకు రావాలి అంటే ప్రతి ఒక్కరూ మాస్క్ లు ధరించడం తప్పనిసరి అని ప్రధాని తో సైతం రాష్ట్రాల సీఎం లు చెబుతున్నప్పటికీ పెడచెవిన పెట్టి ప్రజలు బయటకు వచ్చేస్తున్నారు.అయితే సినిమా హీరోల ద్వారా ఈ విషయాన్నీ తెలియజేయాలి అంటే అది కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కష్టంగానే ఉంది.
అందుకేనేమో దర్శక ధీరుడు రాజమౌళి తన ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియో ను షేర్ చేశాడు.ఇంతకీ ఆ వీడియో లో ఏముందో తెలుసా.
రాజమౌళి దర్శకత్వం వహించి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసిన బాహుబలి చిత్రం ఎంతగా ఆదరణ పొందిందో అందరికీ తెలిసిందే.అందుకే ఇప్పుడు ఆ సినిమా లోని బాహుబలి,భల్లాల దేవ ల మధ్య జరిగిన ఒక ఫైట్ సన్నివేశం కు క్రియేటివిటీ జోడించి సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు.
దీనితో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి సినిమాలో ప్రభాస్, రానా ల మధ్య ఓ ఫైట్ సన్నివేశం లో వారిద్దరి మూతులకు మాస్కు ధరించినట్లు చూపించారు.
ఇక ఆ వీడియో ను ట్విట్టర్ లో షేర్ చేస్తూ మాహిష్మతి లోను మాస్కులు తప్పని సరి అంటూ క్యాప్షన్ పెట్టి మరి పోస్ట్ చేయడం తో అది కాస్త వైరల్ గా మారింది.ఆ వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.
ప్రజలకు మాస్కుపై అవగాహన కల్పించేందుకు అవినాష్ అండ్ టీం బాహుబలిలోని ఈ సన్నివేశాన్ని వీఎఫ్ఎక్స్ని ఉపయోగించి ప్రభాస్, రానా మఖాలకి మాస్క్ వేసినట్లు తెలుస్తుంది.మొత్తానికి ఈ మాస్క్ ల గోల మాహిష్మతికి కూడా చేరిపోయింది అన్నమాట.