సల్మాన్ ఖాన్ హీరోగా ప్రభుదేవా దర్శకత్వం లో వచ్చిన రాధే సినిమా థియేటర్లు పూర్తి స్థాయిలో లేని కారణంగా హైబ్రీడ్ విధానంలో విడుదల అయిన విషయం తెల్సిందే.రాధే సినిమా తీసుకు వచ్చిన కొత్త పద్దతి ని ఇండస్ట్రీలో చాలా మంది కొత్త ఫిల్మ్ మేకర్స్ పాటించాలనే నిర్ణయానికి వచ్చారు.
త్వరలోనే రాధే విడుదల అయిన హైబ్రీడ్ పద్దతిన కొన్ని సినిమాలు రాబోతున్నాయి.అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.
హైబ్రీడ్ విధానం అంటే సాధ్యం అయినంత వరకు థియేటర్లలో విడుదల చేయడం.అదే సమయంలో పే పర్ వ్యూ పద్దతిన ఓటీటీ లో విడుదల చేయడం.
రాధే సినిమా ను మొదటి రోజే మిలియన్ మంది చూడటంతో వంద కోట్లకు పైగా వసూళ్లు నమోదు అయ్యాయి.ఇప్పుడు అదే పద్దతిని రాధే శ్యామ్ కు అనువర్తింపజేసి విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారంటూ వార్తలు వస్తున్నాయి.
జీ ప్లెక్స్ సంస్థ భారీ మొత్తంలో ఓటీటీ, శాటిలైట్ మరియు థియేట్రికల్ రైట్స్ ను కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది.థియేటర్ ద్వారా విడుదల అయితే ఏ రేంజ్ లో వసూళ్లు నమోదు అవుతాయో అంతకు మించి ఈ సినిమాకు రప్పిస్తామనే నమ్మకంతో వారు చెబుతున్నారు.
రాధేశ్యామ్ సినిమా కు పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు ఉంది.కనుక సినిమా మొదటి వారం రోజుల్లోనే అయిదు వందల కోట్ల రూపాయలను వసూళ్లు సాధిస్తాయనే నమ్మకంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.
ఇక శాటిలైట్ మరియు ఓటీటీ రైట్స్ ద్వారా 100 కోట్ల వరకు వస్తాయని కూడా అంటున్నారు.ఈ డీల్ కు ప్రభాస్ ఒప్పుకుంటే వెంటనే జీ 5 సంస్థ భారీ మొత్తంలో యూవీ వారికి అడ్వాన్స్ ను కూడా ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారట.
రాధే శ్యామ్ సినిమా పై ఉన్న బజ్ నేపథ్యంలో ఖచ్చితంగా డిమాండ్ చేసినంత వారు ఇచ్చే అవకాశం ఉంది.మరి ప్రభాస్ ఇందుకు ఒప్పుకుంటాడా లేదంటే థియేటర్ రిలీజ్ కు సిద్దం అవుతాడా అనేది చూడాలి.