ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా ప్రారంభం అయ్యి నాలుగు అయిదు సంవత్సరాలు అవుతుంది.సాహో సినిమా విడుదలకు ముందే అంటే సాహో సినిమా చిత్రీకరణ దశలో ఉండగానే ఆ సినిమా షెడ్యూల్ గ్యాప్ లో రాధే శ్యామ్ సినిమా ఒకటి రెండు షెడ్యూల్స్ ను ముగించారు.
సాహో విడుదల అయ్యి చాలా కాలం అయ్యింది.అయినా కూడా రాధే శ్యామ్ రాలేదు.
ఈ సంక్రాంతికి వస్తుంది లే అనుకుంటూ ఉండగా కరోనా థర్డ్ వేవ్ మళ్లీ వాయిదా వేసేలా చేసింది.ఇక రాధే శ్యామ్ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో యుద్దాలే చేశారు అనడంలో సందేహం లేదు.
ఎందుకంటే టైటిల్ ను కూడా ప్రకటించని సమయంలో ప్రభాస్ ఏం చేస్తున్నాడు.షూటింగ్ ఎంత వరకు వచ్చింది అనే విషయాలను యూవీ వారు అస్సలు ప్రకటించలేదు.
దాంతో ఒకసారి ప్రభాస్ అభిమానులు కోపంతో బ్యాన్ యూవీ క్రియేషన్స్ అంటూ ట్వట్టర్ లో హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేశారు.
అంతటి ఘనత ఉన్న అభిమానులను కలిగి ఉన్న ప్రభాస్ రాధే శ్యామ్ నుండి అప్డేట్ వచ్చింది.
అయితే ఈసారి ఎలాంటి డిమాండ్ చేయకుండానే మేకర్స్ మేకింగ్ స్టిల్స్ ను విడుదల చేశారు.స్టిల్స్ లో ప్రభాస్ ను చూస్తుంటే అబ్బ అన్నట్లుగా ఉందంటూ అమ్మాయిలు కామెంట్స్ చేస్తున్నారు.
రాధే శ్యామ్ సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యి విడుదలకు సిద్దంగా ఉంది.
జనవరిలో మిస్ అయిన రాధే శ్యామ్ ను ఏప్రిల్ లో చూసే అవకాశాలు ఉన్నాయంటున్నారు.అది ఎంత వరకు నిజం అనేది చూడాలి.ఈ సినిమా లో ప్రభాస్ కు జోడీగా పూజా హెగ్డే నటించింది.
ఈ సినిమా కు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను థమన్ అందిస్తున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి.కృష్ణం రాజు కీలక పాత్రలో నటించిన ఈ సినిమా తెలుగు మరియు సౌత్ లాంగ్వేజ్ లకు మరియు హిందీకి వేరు వేరు నటీ నటులు మరియు పాటలు ఉండబోతున్నట్లుగా చెబుతున్నారు.