యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రూపొందిన రాధే శ్యామ్ విడుదలకు సిద్దం అయ్యింది.ఈ సినిమా ను సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే ప్రకటించారు.
సంక్రాంతి దగ్గర పడుతున్న నేపథ్యంలో మెల్ల మెల్లగా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలు పెడుతున్నారు.మొన్నటి వరకు ఆదిపురుష్ షూటింగ్ లో ఉన్న ప్రభాస్ రాధే శ్యామ్ టీమ్ తో జాయిన్ అయ్యేందుకు సిద్దం అయ్యాడు.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే ప్రమోషన్ కు సంబంధించిన విషయాలపై యూవీ క్రియేషన్స్ టీమ్ తో ప్రభాస్ చర్చించాడు.ఎప్పుడెప్పుడు ఏం కార్యక్రమాలను నిర్వహించాలనే విషయమై ఒక స్పష్టమైన క్లారిటీకి వచ్చారు అనే సమాచారం అందుతోంది.
ఇక వారం రోజుల్లో రాధే శ్యామ్ నుండి మొదటి పాటను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తునన్ఆరు.అందుకు సంబంధించిన పలు ప్రత్యేకతలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం రాధే శ్యామ్ సినిమా లోని పాటలు సౌత్ వర్షన్ కు వేరు మరియు హిందీ వర్షన్ కు వేరు అన్నట్లుగా ట్యూన్ చేయించారు.ఈ వారంలో విడుదల కాబోతున్న మొదటి పాటకు సంబంధించి నార్త్ లో ఒక పాట మరియు సౌత్ లో ఒక పాటను విడుదల చేయబోతున్నారు.అంటే రెండు వేరు వేరు పాటలను విడుదల చేయబోతున్నారు.ఉత్తరాది ప్రేక్షకుల కోసం హిందీలో పాటను ప్రత్యేకంగా విడుదల చేయబోతున్నాడు.ఇక సౌత్ లో అన్ని భాషలకు కూడా ఒకే పాట ఉంటుందట.విడుదల కాబోతున్న పాట కోసం అత్యున్నత సింగర్స్ ను పాడించారని.
అలాగే భారీ ఎత్తున విజువల్స్ ను కూడా అందిస్తున్నట్లుగా చెబుతున్నారు.మొదటి పాటతోనే సినిమా పై అంచనాలు మరింతగా పెంచేలా ప్లాన్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు.
రికార్డు స్థాయిలో ఈ సినిమా పాటలు యూట్యూబ్ లో ట్రెండ్ అయ్యేలా ఉన్నాయంటూ టాక్ వినిపిస్తుంది.
తాజా వార్తలు