ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నట రాధేశ్యామ్ సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చింది.ఈ సినిమా ను డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేయబోతున్నట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి.
యూవీ క్రియేషన్స్ వారి పేరుతో ఒక ప్రెస్ నోట్ వచ్చింది.సినిమాను ఓటీటీ ద్వారా విడుదల చేయబోతున్నట్లుగా అందులో పేర్కొన్నారు.
ఇటీవల చిన్న సినిమాలు కూడా ఓటీటీకి వెళ్లడం లేదు.అలాంటిది ఎందుకు రాధేశ్యామ్ ఓటీటీకి వెళ్తుందని చాలా మంది అనుమానం వ్యక్తం చేశారు.
ఎక్కువ మంది రాధేశ్యామ్ ఓటీటీ రిలీజ్ వార్తలు పుకార్లే అనుకున్నారు.కాని కొందరు మాత్రం సినిమా ఓటీటీ విడుదల కాకుడదని ఏముంది.
భారీ అమౌంట్ ఆఫర్ ఇవ్వడం వల్ల ఓటీటీకి ఇచ్చేసి ఉంటారేమో అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై యూవీ క్రియేషన్స్ ప్రతినిధులు స్పందించారు.
తమ సినిమాను ఓటీటీ ద్వారా విడుదల చేయబోతున్నట్లుగా వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం.రెండు మూడు వారాల్లో సినిమా విడుదల తేదీని ప్రకటించబోతున్నాం.సినిమాను థియేటర్లలో మాత్రమే విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.సినిమా యూనిట్ సభ్యులు పుకార్లపై స్పందించడంతో ఆ ప్రెస్ నోట్ ఫేక్ అంటూ తేలిపోయింది.పూజా హెగ్డే హీరోయిన్గా రూపొందుతున్న ఈ సినిమాలో కృష్ణం రాజు కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెల్సిందే.ఈ సినిమాను సమ్మర్ చివర్లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
అన్ని అనుకులంగా ఉంటే ఫిబ్రవరి కి సినిమా షూటింగ్ ను పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.రాధేశ్యామ్ సినిమా షూటింగ్ ముగియక ముందే సలార్ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యాడు.
ఆ సినిమా తో పాటు నాగ్ అశ్విన్ మరియు ఆదిపురుష్ సినిమాల్లో కూడా ప్రభాస్ నటిస్తున్న విషయం తెల్సిందే.ఈ నాలుగు సినిమాలు ఈ ఏడాది వచ్చే ఏడాది ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయబోతున్నాయి.