యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరక్షన్ లో భారీ బడ్జెట్ తో వస్తున్న సినిమా రాధేశ్యామ్.యువి క్రియేషన్స్ వారు 250 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా నిర్మిస్తున్నారని తెలుస్తుంది.
పిరియాడికల్ లవ్ స్టోరీగా వస్తున్న ఈ సినిమా నుండి బయటకు వచ్చే ప్రతి అప్డేట్ ఫ్యాన్స్ ను అలరిస్తుంది.లేటెస్ట్ గా సినిమా నుండి ఒక టాక్ బయటకు రాగా అది ఫ్యాన్స్ ను కంగారు పడేలా చేస్తుంది.
ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటి అంటే ప్రభాస్ రాధేశ్యామ్ ఓన్లీ ఫర్ క్లాస్ ఆడియెన్స్ అని కొందరు అంటున్నారు.సినిమా కేవలం క్లాస్ ఆడియెన్స్, మల్టీప్లెక్స్ ప్రేక్షకులను మాత్రమే ఎంటర్టైన్ చేస్తుందని చెబుతున్నారు.
ప్రభాస్ సినిమా అంటేనే మాస్ ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకుంటారు అలాంటిది వారిని డిజప్పాయింట్ చేస్తే ఎలా అంటున్నారు.అయితే రాధేశ్యామ్ సినిమాలో క్లాస్ మాస్ అన్న తేడా లేకుండా అందరిని మెప్పిస్తుందని చిత్రయూనిట్ చెబుతున్నారు.
రాధేశ్యామ్ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది.సినిమా 2022 సంక్రాంతి బరిలో దిగుతుంది. ఈ సినిమాతో పాటుగా ప్రభాస్ సలార్, ఆదిపురుష్ సినిమాలు చేస్తున్నాడు.