యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రానికి సంబంధించిన అప్డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ప్రభాస్ కెరీర్లో 20వ చిత్రంగా వస్తున్న ఈ సినిమాతో ప్రభాస్ మరోసారి బాక్సాఫీస్ వద్ద తనదైన మార్క్ను వేసుకునేందుకు రెడీ అవుతున్నాడు.
జిల్ ఫేం దర్శకడు రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ చాలా సరికొత్త లుక్లో కనిపిస్తాడని తెలుస్తోంది.
కాగా ఈ సినిమాకు ‘రాధేశ్యామ్’ అనే టైటిల్ను చిత్ర యూనిట్ పరిశీలిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాను పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తీర్చిదిద్దుతున్నారు చిత్ర యూనిట్.ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం నెలకొన్న కరోనా వైరస్ కారణంగా వాయిదా పడింది.
కాగా ప్రస్తుతం సినిమా షూటింగ్లకు ప్రభుత్వం అనుమతినివ్వడంతో టాలీవుడ్లో పలు సినిమాలు షూటింగ్లను మొదలుపెడుతున్నాయి.దీంతో ప్రభాస్ చిత్ర యూనిట్ కూడా ఈ సినిమా షూటింగ్ను జూలైలో ప్రారంభించాలని తొలుత భావించింది.
కానీ కరోనా వైరస్ ప్రభావం మరింత పెరుగుతుండటంతో ఈ సినిమా షూటింగ్ను జూలై నెలలో నిర్వహించవద్దని చిత్ర యూనిట్ నిర్ణయం తీసుకుంది.ఇప్పటికే రెండు నెలలకు పైగా ఈ సినిమా షూటింగ్కు బ్రేక పడగా, ఇప్పుడు మరో నెలపాటు ఈ సినిమా పట్టాలెక్కే ఛాన్స్ లేదని తెలుస్తోంది.
దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ మరోసారి నిరాశకు లోనవుతున్నారు.మరి ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ జూలైలో కూడా రాదని వారు తీవ్ర నిరాశ చెందుతున్నారు.
పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.