యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ అనే చిత్రం తెరకెక్కుతుంది.వచ్చే ఏడాదిలో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
ఈ ఏడాదిలోనే సినిమా విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా కరోనా కారణంగా సినిమా షూటింగ్ జరగడం లేదు.దాంతో సినిమాను వచ్చే ఏడాదికి వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చిందని అంటున్నారు.
ఈ సమయంలోనే ప్రభాస్ తన తదుపరి చిత్రాన్ని కూడా కన్ఫర్మ్ చేశాడు.
ప్రభాస్ హీరోగా 20వ చిత్రంగా రాధేశ్యామ్ తెరకెక్కుతుండగా, 21వ చిత్రంగా మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు.
ఆ సినిమా షూటింగ్ను వచ్చే ఏడాది ప్రారంభించి 2022లో విడుదల చేస్తామంటున్నారు.కరోనా పరిస్థితి ఇలాగే ఉంటే 2022లో ఆ చిత్రం వచ్చేది అనుమానంగానే ఉంది.ప్రస్తుతానికి అయితే ప్రభాస్ 2022 చివరి వరకు ఖాళీ లేడు.ఇలాంటి సమయంలో ప్రభాస్ కొత్త సినిమా గురించిన చర్చ సినీ వర్గాల్లో తారా స్థాయిలో రావడం చర్చనీయాంశంగా ఉంది.
ప్రభాస్ 22వ సినిమా బాలీవుడ్లో ఉంటుందనేది గత కొన్ని రోజులుగా వస్తున్న వార్త ప్రధాన సారాంశం.ఛారిత్రాత్మక చిత్రం అంటూ కొందరు, మల్టీ స్టారర్ చిత్రం అంటూ మరి కొందరు ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు ప్రచారం చేస్తున్నారు.ప్రభాస్ ప్రస్తుతం కొత్త సినిమాల కోసం కథలు వింటున్న మాట వాస్తవమే కాని నాగ్ అశ్విన్ సినిమా పూర్తి అయ్యే వరకు కొత్త సినిమాకు అధికారికంగా సైన్ పెట్టడు అంటూ యూవీ క్రియేషన్స్ వారు బల్ల గుద్ది మరీ చేబుతున్నారు.2022 తర్వాతే ప్రభాస్ కొత్త సినిమా కన్ఫర్మ్ అంటున్నారు.