తెలుగులో ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ “రాధే శ్యామ్” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.ఈ చిత్రంలో ప్రభాస్ కి జోడీగా టాలీవుడ్ బుట్ట బొమ్మ “పూజా హెగ్డే” నటిస్తోంది.
కాగా ఈ చిత్రానికి టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు “కేకే.రాధా కృష్ణ” దర్శకత్వం వహిస్తుండగా టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ “యు.వి.క్రియేషన్స్” నిర్మిస్తోంది.అయితే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు దాదాపుగా రెండేళ్ల క్రితమే మొదలైనప్పటికీ పలు అనివార్య కారణాల వల్ల ఇప్పటికీ పూర్తి కాలేదు.దీంతో ప్రభాస్ అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.
అయితే తాజాగా ఈ చిత్ర విడుదలపై రాధే శ్యామ్ చిత్ర యూనిట్ సభ్యులు స్పందించారు.
ఇందులో భాగంగా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి నెలలో 14వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
అలాగే ఈ చిత్రాన్ని దాదాపుగా 5 భాషలలో విడుదల చేస్తున్నట్లు కూడా తెలిపారు.అంతేకాకుండా ఈ విషయానికి సంబంధించిన పోస్టర్ ని కూడా చిత్ర యూనిట్ సభ్యులు విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.
అయితే ఈ పోస్టర్ లో రెబల్ స్టార్ ప్రభాస్ ఫార్మల్స్ లుక్ లో కొట్టాడు.
దీంతో కొందరు అభిమానులు ఈ పోస్టర్ పై స్పందిస్తూ మరోమారు పవర్ ప్యాక్ హిట్ కన్ఫర్మ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.మరి కొందరు మాత్రం ఈ ఏడాది కూడా ప్రభాస్ సినిమా లేకపోవడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నట్లు కామెంట్ల రూపంలో దర్శకుడి కే.కే రాధా కృష్ణ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు 2019వ సంవత్సరంలో మొదలయ్యాయి.ఆ తర్వాత ప్రభాస్ డేట్లు మరియు కరోనా వైరస్ కారణంగా షూటింగులకు బ్రేక్ పడటంతో ఈ చిత్రాన్ని అనుకున్న సమయానికి పూర్తి చేయలేకపోయారు.
అయితే ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులను పూర్తి చేయాలని చిత్ర యూనిట్ సభ్యులు అనుకున్నప్పటికీ ప్రభాస్ ప్రస్తుతం బాలీవుడ్ మరియు టాలీవుడ్ లో రెండు భారీ బడ్జెట్ చిత్రాల్లో హీరోగా నటిస్తున్నాడు.దీంతో డేట్లు కుదరక పోవడంవల్లే ఈ చిత్ర విడుదలను వచ్చే ఏడాదికి వాయిదా వేసినట్లు సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.