ఈ ఏడాది మన టాలీవుడ్ తో పాటు పాన్ ఇండియా లెవల్లో మోస్ట్ అవైటెడ్ సినిమాగా రాధేశ్యామ్ నిలిచింది.ఈ సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
కానీ కరోనా వాళ్ళ ఆశలపై ఎప్పటికప్పుడు నీళ్లు చెల్లుతుంది.ఈ సినిమా ఎప్పటి నుండో షూటింగ్ జరుపుకుంటుంది.
మధ్యలో కరోనా కారణంగా వాయిదా పడడంతో ఈ సినిమా ఆలస్యం అవుతూ వస్తుంది.
రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
ఈ సినిమాలో ప్రభాస్ కు జంటగా పూజ హెగ్డే నటిస్తున్నారు.యువీ క్రియేషన్స్ వారు ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.ఈ మధ్యనే ఈ సినిమాను జనవరి 14 న విడుదల చేసి సంక్రాంతి రేస్ లో నిలుపుతున్నామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
దీంతో ఇంకా నాలుగు నెలలు ఉన్న ఇప్పటి నుండే ప్రమోషన్స్ స్టార్ట్ చెయ్యాలని భావిస్తున్నారట.
ఇంత వరకు ఈ సినిమా నుండి రెండు ముందు పోస్టర్స్ తప్ప వేరే అప్డేట్ ఏమి రాకపోవడంతో డార్లింగ్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు.
అందుకే ఇప్పటి నుండే ప్రమోషన్స్ స్టార్ట్ చేసి ఈ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చెయ్యాలని మేకర్స్ భావిస్తున్నట్టు తెలుస్తుంది.ఇంత వరకు ఏ విధమైన ప్రమోషన్స్ చేయని రాధేశ్యామ్ యూనిట్ ఇప్పుడు వరుస ట్రీట్స్ తో రెడీ అవుతుందట.
సెప్టెంబర్ నుండి సినిమా ప్రమోషన్స్ కోసం బరిలోకి దిగబోతున్నారు మేకర్స్.ముందుగా మేకింగ్ వీడియోస్ రిలీజ్ చేస్తారట.ఆ తర్వాత లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేయనున్నారని తెలుస్తుంది.ఇంకా నాలుగు నెలల సమయం ఉండడంతో ఈలోపు ప్రమోషన్స్ బాగా చేసి సాంగ్స్ హిట్ అయితే ఈ సినిమాపై మరింత పాజిటివ్ నెస్ పెరుగుతుందని మేకర్స్ అభిప్రాయ పడుతున్నారని తెలుస్తుంది.
మరి ఎప్పటి నుండి స్టార్ట్ చేస్తారో వేచి చూడాల్సిందే.