యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.ఈ సినిమాను జిల్ ఫేం దర్శకుడు రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ప్రభాస్ 20వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీ పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతోందట.ఈ సినిమా షూటింగ్ ఇటీవల జార్జియాలో పూర్తి చేసుకుని వచ్చింది.
ప్రభాస్ సరికొత్త లుక్లో కనిపించబోయే ఈ సినిమాలో పలు అంశాలు చిత్రానికే హైలైట్ కానున్నట్లు తెలుస్తోంది.పీరియాడికల్ గెటప్లో ప్రభాస్ లుక్ అదిరిపోతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
కాగా ఈ సినిమాలో ఎమోషన్కు పెద్దపీట వేశారట చిత్ర యూనిట్.కొన్ని ఎమోషనల్ సీన్స్లో ప్రభాస్ ప్రేక్షకులను కంటతడి పెట్టించడం ఖాయమని తెలుస్తోంది.
ప్రభాస్ యాక్టింగ్తో ప్రేక్షకులకు అదిరిపోయే ట్రీట్ ఇవ్వడం ఖాయమని తెలుస్తోంది.
అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను యువీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ బ్యానర్లు సంయుక్తంగా భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నాయి.
మరి ఈ సినిమాలో ప్రేక్షకులను మెప్పించే ఎమోషన్ కంటెంట్ ఎలా ఉంటుందో చూడాలి.