యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఇండియాలోనే టాప్ స్టార్ గా దూసుకు పోతున్నారు.ఆయన ప్రస్తుతం చేస్తున్న సినిమా ల విలువ వెయ్యి కోట్లకు మించి ఉంటుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా లు ఒకొక్కటిగా ఈ ఏడాది చివరి నుండి విడుదల కాబోతున్నాయి.ఈ సమయంలోనే కొత్త సినిమా అప్ డేట్ కూడా వచ్చింది.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ బాలీవుడ్ లో చేయబోతున్న మరో సినిమా ను సెప్టెంబర్ లో ప్రకటించి వచ్చే ఏడాది పట్టాలెక్కించబోతున్నారు.ఆ బాలీవుడ్ మూవీకి ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించబోతున్నాడు.
ఆ సినిమా భారీ బడ్జెట్ మూవీగా.యాక్షన్ సినిమాగా రూపొందుతున్నట్లుగా చెబుతున్నారు.
ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి.
ఇక ప్రభాస్ రాధే శ్యామ్ విషయానికి వస్తే షూటింగ్ అతి త్వరలో ముగియబోతుంది.షూటింగ్ ముగిసిన వెంటనే ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలు పెట్టబోతున్నారు.షూటింగ్ ముగిసిన సమయంలో యూనిట్ సభ్యుల ఫొటోను షేర్ చేయబోతున్నారు.
తద్వార ప్రమోషన్స్ ప్రారంభం అవుతాయి.ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ పోస్టర్ లు టీజర్.
ట్రైలర్ తో రాధే శ్యామ్ ను దేశ వ్యాప్తంగా ఫేమస్ చేయబోతున్నారు.తద్వారా భారీ ఎత్తున విడుదల చేసే అవకాశాలు ఉంటాయి.
ఇక సలార్ విషయానికి వస్తే దర్శకుడు ప్రశాంత్ నీల్ తదుపరి షెడ్యూల్ ను ఆగస్టులో ప్లాన్ చేశాడు.అందుకు సంబంధించిన ఏర్పాట్లలో మునిగి పోయాడు.
సలార్ మరియు ఆదిపురుష్ ల షూటింగ్ లో ప్రభాస్ సమాంతరంగా నటించబోతున్నాడు.సలార్ సినిమాను సంక్రాంతికి అంటూ ప్రకటించిన ప్రశాంత్ నీల్ కొత్త తేదీని అతి త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు.
ఇక ఆదిపురుష్ ప్రస్తుతానికి విడుదల వాయిదా పడదని.వచ్చే ఏడాది ఆగస్టులో విడుదల చేస్తారనే ప్రచారం జరుగుతోంది.