ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న రాధే శ్యామ్ సినిమా చిత్రీకరణ పూర్తి అవ్వడానికి చిన్న షెడ్యూల్ మాత్రమే బ్యాలన్స్ ఉందంటూ మొన్నటి వరకు వార్తలు వచ్చాయి.గత నెలలోనే సినిమా షూటింగ్ ను ప్రారంభించారు.
రెండు వారాల్లో షూటింగ్ ను ముగిస్తారంటూ అంతా అనుకున్నారు.కాని అనూహ్యంగా సినిమా షూటింగ్ ఆలస్యం అయ్యింది.
ఇటీవల సినిమా గురించి వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవం.కొందరు సినిమా షూటింగ్ పూర్తి అయ్యిందని.
గుమ్మడి కాయ కొట్టేశారు అంటూ వార్తలు ప్రచారం చేశారు.కాని ఇప్పటి వరకు షూటింగ్ ను ప్రభాస్ మొదలు పెట్టలేదు.
నేడు రాధే శ్యామ్ షూటింగ్ లో ప్రభాస్ జాయిన్ అయ్యాడు.ఈ విషయంలో అనుమానం లేకుండా పీఆర్ టీమ్ ఈ విషయాన్ని క్లారిటీ ఇచ్చింది.
నేడు రాధే శ్యామ్ చివరి దశ షూటింగ్ లో ప్రభాస్ జాయిన్ అయ్యాడు కనుక ఇక రెండు వారాల్లోనే సినిమాకు గుమ్మడి కాయ కొట్టే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం రాధే శ్యామ్ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ లో వేసిన భారీ సెట్టింగ్ లో ప్రస్తుతం షూటింగ్ జరుగుతుంది.
అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని కూడా ఇటీవల యూనిట్ సభ్యులు పేర్కొన్నారు.ఇప్పుడు షూటింగ్ లో ప్రభాస్ జాయిన్ అవ్వడం వల్ల సినిమా విడుదల తేదీ గురించి చర్చ మొదలు అయ్యింది.ఈ ఏడాదిలో విడుదల చేయాలని మేకర్స్ పట్టుదలతో ఉన్నారు.కాని థియేటర్లు ఓపెన్ అయ్యి కరోనా కనికరిస్తే అప్పుడు విడుదల అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ను యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న విషయం తెల్సిందే.