ప్రభాస్.పూజా హెగ్డే జంటగా రూపొందుతున్న రాధే శ్యామ్ సినిమా షూటింగ్ ముగిసింది అంటూ కొన్ని రోజుల క్రితం యూవీ క్రియేషన్స్ వారు అధికారికంగా ప్రకటించారు.
కాని ఇప్పుడు సత్యరాజ్ పై రాధే శ్యామ్ కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.సినిమాకు సంబంధించిన చిత్రీకరణ ముగిసింది అంటూ చెప్పి మళ్లీ ఇప్పుడు ఈ రీ షూట్ ఏంటీ అంటూ అంతా ప్రశ్నిస్తున్నారు.
ప్రభాస్ కూడా ఈ రీషూట్ లో పాల్గొంటాడా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.రాధే శ్యామ్ దర్శకుడు రాధాకృష్ణ కు క్లారిటీ లేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం సినిమాకు సంబంధించిన పుకార్ల విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా చిత్ర యూనిట్ సభ్యులు స్పందించారు.సినిమా కు సంబంధించిన సత్యరాజ్ సన్నివేశాలను గతంలోనే చిత్రీకరించాల్సి ఉన్నా కూడా ఆయన డేట్లు కుదరక పోవడం వల్ల ఆ సమయంలో షూటింగ్ చేయడం లో విఫలం అయ్యారు.
అందుకే సినిమా కోసం ఆయన డేట్లు ఇప్పుడు కేటాయిస్తే వారం రోజుల పాటు ఆ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లుగా చెబుతున్నారు.సత్యరాజ్ సన్నివేశాలకు ప్రభాస్ అవసరం లేదు.
ఇద్దరి కాంబో సన్నివేశాలు గతంలోనే జరిగాయి.కనుక ఇప్పుడు ప్రభాస్ షూటింగ్ లో జాయిన్ అవ్వడు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు.రాధే శ్యామ్ సినిమా షూటింగ్ ను అధికారికంగా ముగించారు.కాని అది ప్యాచ్ వర్క్ మాత్రమే.కనుక సినిమా విడుదలకు ఎలాంటి డౌట్ లేదు.సంక్రాంతికి ఖచ్చితంగా రాధే శ్యామ్ వస్తుంది అనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.
వచ్చే ఏడాదిలో ఖచ్చితం గా ప్రభాస్ నుండి రెండు లేదా మూడు సినిమా లు వస్తాయి అంటున్నారు.