మన దేశంలో బాలీవుడ్ అతి పెద్ద ఇండస్ట్రీ.అందుకే అక్కడి హీరోలు గొప్ప వాళ్ళ లాగా ఫీల్ అవుతూ ఉంటారు.
అంతేకాదు ఈ పేరు చెప్పుకుని వందల కోట్ల పారితోషికం తీసుకుంటారు.పారితోషికంతో పాటు సినిమా లాభాల్లో కూడా వాటా తీసుకుంటారు.
బాలీవుడ్ లో వాళ్ళ గ్రాఫ్ ను బట్టి పారితోషికం డిసైడ్ చేస్తుంటారు.ఇక ప్రెసెంట్ అయితే ఖాన్ హీరోలు ఎక్కువ పారితోషికం తీసుకుంటున్నారు.
అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ తో పాటు అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్ కూడా వందల కోట్ల పారితోషికం అందుకుంటున్నారు.అయితే ఇప్పుడు అంత మారిపోయింది.
ఈ బాలీవుడ్ హీరోలందరిని మన తెలుగు స్టార్ హీరో వెనక్కి నెడుతున్నాడు.అతనెవరో కాదు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.
ప్రభాస్ ప్రాజెక్ట్స్ చూస్తే ఈ విషయం అర్ధం అవుతుంది.
ప్రెసెంట్ ప్రభాస్ చేతిలో ఉన్న ప్రాజెక్ట్ లు అన్ని పాన్ ఇండియా సినిమాలుగానే తెరకెక్కుతున్నాయి.
రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్, ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే సినిమాలు తెరకెక్కుతున్నాయి.ఇక ఈ సినిమాలు విడుదల అయ్యి సక్సెస్ అయితే మాత్రం అన్ని సినిమాలు 500 కోట్లకు పైమాటగానే వసూలు చేస్తాయి.
ఇక ప్రభాస్ ఆదాయం కూడా భారీ స్థాయిలో పెరిగి పోతుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.ప్రభాస్ ఆదాయం సుమారు 1500 కోట్లకు చేరిపోతుందని అంచనా వేస్తున్నారు.ఈ విషయం నిజమైతే మాత్రం బాలీవుడ్ హీరోలను వెనక్కి నెట్టి నట్టే.మొత్తానికి మన తెలుగు స్టార్ బాలీవుడ్ ని ఏలుతున్నాడని అర్ధం అవుతుంది.ప్రభాస్ చేతిలో ఇన్ని ప్రాజెక్ట్స్ ఉన్న కూడా బాలీవుడ్ డైరెక్టర్లు ఇంకా ప్రభాస్ వెనుక పడుతూనే ఉన్నారు.