మహానటి సినిమా తర్వాత నాగ్ అశ్విన్ మళ్లీ చాలా గ్యాప్ తీసుకున్నాడు.ఎంత ఎక్కువ గ్యాప్ తీసుకుంటే అంత మంచి సినిమా తో దర్శకుడు నాగ్ అశ్విన్ వస్తాడని అభిమానులు అనుకుంటూ ఉన్నారు.
వైజయంతి మూవీస్ బ్యానర్ లో ప్రభాస్ తో ప్రాజెక్ట్ కే సినిమా ను దర్శకుడు నాగ్ అశ్విన్ చేస్తున్న విషయం తెల్సిందే.భారీ అంచనాలున్న ప్రాజెక్ట్ కే సినిమా చిత్రీకరణ కొన్ని నెలల క్రితం మొదటి షెడ్యూల్ జరిగింది.
ఆ షెడ్యూల్ లో కేవలం అమితాబచ్చన్ మాత్రమే పాల్గొన్నాడు.దాదాపుగా వారం రోజుల పాటు ఆ షెడ్యూల్ జరిగిందట.
ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.ఇక తాజాగా ప్రాజెక్ట్ కే కొత్త షెడ్యూల్ ప్రారంభం అయ్యింది.
ప్రాజెక్ట్ కే కొత్త షెడ్యూల్ కోసం బాలీవుడ్ టాప్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే వచ్చిన విషయం తెల్సిందే.ఆమె హైదరాబాద్ లోనే షూటింగ్ లో పాల్గొంటుంది.
రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన సెట్టింగ్ లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నారు.ఇదే సమయంలో సినిమాకు సంబంధించిన కీలక పాట ఒకటి చిత్రీకరిస్తారని కూడా తెలుస్తోంది.
భారీ ఎత్తున అంచనాలున్న ప్రాజెక్ట్ కే సినిమా షూటింగ్ జనవరి వరకు కొనసాగుతుందని అంటున్నారు.మూడవ షెడ్యూల్ ను మళ్లీ వచ్చే సమ్మర్ లో నిర్వహించబోతున్నారు.
ఈ గ్యాప్ లో సలార్ ను మొదలు పెట్టబోతున్నారు.మొత్తానికి ప్రభాస్ సినిమా లు బ్యాక్ టు బ్యాక్ విడుదలకు సిద్దం అవుతున్నాయి.ప్రాజెక్ట్ కే సినిమా వచ్చే ఏడాది లో చివర్లో వస్తుందని మొన్నటి వరకు అనుకున్నారు.కాని 2023 వరకు ఈ సినిమా కోసం వెయిట్ చేయక తప్పదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
ప్రాజెక్ట్ కే సినిమా టైమ్ ట్రావెల్ స్టోరీ తో రూపొందబోతుంది అంటున్నారు.అసలు కథ ఎలా ఉంటుంది.దర్శకుడు 500 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టబోతున్నాడు.ఈ సినిమా పాన్ వరల్డ్ మూవీ ఎలా అవుతుంది అనే విషయాలను ముందు ముందు క్లారిటీగా చెప్తారేమో చూడాలి.