ప్రెజెంట్ పాన్ ఇండియా మార్కెట్ లో భారీ మార్కెట్ ను తనకంటూ క్రియేట్ చేసుకున్న స్టార్ ప్రభాస్.బాహుబలి సినిమాతో ప్రభాస్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.
ప్రెజెంట్ ఈయన నటిస్తున్న సినిమాల్లో ఆదిపురుష్ ఇప్పటికే షూట్ పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీగా ఉంచాడు.అయితే ఈ సినిమా ఈ సంక్రాంతికే రిలీజ్ కావాల్సి ఉంది.
కానీ కొన్ని కారణాల వల్ల మళ్ళీ వాయిదా వేశారు.జూన్ 16న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.ఇది కూడా వాయిదా పడే అవకాశం ఉందని.ఈ సినిమా 2024 లో రిలీజ్ అవుతుంది అని రూమర్స్ వచ్చాయి.
ఇక ఈ సినిమాతో పాటు మరో మూడు ప్రాజెక్టులతో డార్లింగ్ బిజీగా ఉన్నాడు.అందులో సలార్ ఒకటి.
కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.ప్రభాస్ అభిమానులు ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుకుంటున్నారు.
మొన్నటి వరకు ఆగిపోయిన ఈ షూట్ ఇటీవలే స్టార్ట్ అయ్యి శరవేగంగా పూర్తి అవుతుంది.ఈ సినిమా 2023 సెప్టెంబర్ 28న రిలీజ్ కాబోతున్నట్టు ప్రకటించారు.ఈ సినిమాను హోంబళ్లే ప్రొడక్షన్ బ్యానర్ పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తుండగా.శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాను నీల్ యాక్షన్ బ్లాక్ బస్టర్ గా తెరకెక్కిస్తున్నాడు.మరి 2023లో కేవలం ఈ సినిమాతోనే డార్లింగ్ వస్తున్నాడు అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.
కానీ సలార్ సోలోగా రావడం లేదని ఈ సినిమాతో పాటు మరో సినిమా కూడా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.ప్రభాస్ రుతి దర్శకత్వంలో కూడా ఒక సినిమాకు కమిట్ అయిన విషయం తెలిసిందే.
ఈ సినిమా కూడా సైలెంట్ గా షూట్ జరుపు కుంటుంది.ఈ సినిమా కూడా 2023లోనే వస్తుంది అని అంటున్నారు.
అందుకే సలార్ ఒక్కటే కాకుండా మరో సినిమా కూడా డార్లింగ్ నుండి రాబోతున్నది కాబట్టి ఫ్యాన్స్ ఖుషీగా ఉండడం బెటర్.