యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాధేశ్యామ్ సినిమా రూపొందుతున్న ఈ విషయం తెల్సిందే.ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చింది.
సమ్మర్ లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉంది.ఈ సమయంలోనే ప్రభాస్ సలార్ మూవీని పట్టాలెక్కించాడు.
కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమాను ప్రభాస్ చేయబోతున్న విషయం తెల్సిందే.ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి.
అంచనాలకు తగ్గట్లుగా సినిమా ను భారీ యాక్షన్ సన్నివేశాలతో తీస్తాను అంటూ చెబుతున్నాడు.ఇలాంటి సమయంలో సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
అది ఏంటీ అంటే సినిమాను ఈ ఏడాది దసరాకే విడుదల చేస్తారట.సినిమాకు గ్రాఫిక్స్ వర్క్ ఎక్కవ ఏమీ లేదు.
యాక్షన్ ప్రధానంగా సాగే సినిమా కాబట్టి సినిమాను ఇదే ఏడాదిలో విడుదల చేయాలని ప్రశాంత్ నీల్ భావిస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.
కేజీఎఫ్ సినిమాను దాదాపుగా ఏడాదిన్నర పాటు తీసిన ప్రశాంత్ నీల్ ప్రభాస్ మూవీని అంత తక్కువ సమయంలో తీయడం కోసం పక్కా ప్లాన్ చేసుకున్నాడట.అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. కేజీఎఫ్ 2 సినిమా ప్రేక్షకుల ముందుకు రాకముందే ప్రశాంత్ నీల్ సలార్ సినిమాను పట్టాలు ఎక్కించడంతో పాటు సినిమాను శరవేగంగా పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.
పెద్ద ఎత్తున సినిమాపై అంచనాలు ఉన్నాయి.ఇలాంటి సమయంలో సినిమాకు సంబంధించిన షూటింగ్ హడావుడిగా చేయడం వల్ల ఏమైనా తేడా వస్తుందా అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఏది ఏమైనా ఈ ఒక్క ఏడాదిలోనే ప్రభాస్ నుండి రాధే శ్యామ్ మరియు సలార్ సినిమాలు రాబోతున్న నేపథ్యంలో ప్రభాస్ ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా అంటూ అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.