యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో సినిమా కోసం పదుల సంఖ్యలో నిర్మాతలు వెయిట్ చేస్తున్నారు అనడంలో సందేహం లేదు.వరుసగా ప్రభాస్ సినిమాలు చేస్తున్నాయన వెనుక ఇంకా అరడజను మంది నిర్మాతలు వెయిట్ చేస్తున్నారు.
బాహుబలి సమయం నుండి ప్రభాస్ తో సినిమా కోసం వెయిట్ చేస్తున్న నిర్మాత దిల్ రాజుకు ఎట్టకేలకు ఓకే చెప్పినట్లుగా సమాచారం అందుతోంది.ప్రభాస్ హీరోగా ఇప్పటికే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతుంది.
ఆ సినిమా కు సలార్ అనే టైటిల్ ను ఖరారు చేసి మొదటి షెడ్యూల్ ను కూడా పూర్తి చేశారు.ఇలాంటి సమయంలో మరో సినిమా ను కూడా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ చేయబోతున్నాడు అని ఆ సినిమా ను దిల్ రాజు నిర్మించబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతోంది.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ మూవీ పూర్తి అయిన తర్వాత వీరి కాంబో మూవీ పట్టాలు ఎక్కే అవకాశం ఉంది అంటున్నారు.
ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ విషయమై ప్రభాస్ ఈసారి గుజరాత్ వెళ్లబోతున్నాడు.
సలార్ సినిమా ను ఈ ఏడాది చివర్లోనే పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు.సలార్ పూర్తి అవ్వకుండానే ఎన్టీఆర్ తో మూవీ ని ప్రశాంత్ నీల్ మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
ఇదే సమయంలో అల్లు అర్జున్ తో కూడా సినిమా కు ప్రశాంత్ నీల్ ఓకే చెప్పాడు. కేజీఎఫ్ 2 విడుదలకు సిద్దంగా ఉంది.ఇన్ని సినిమా లు లైన్ లో ఉన్న సమయంలో ప్రశాంత్ నీల్ మళ్లీ ప్రభాస్ తో సినిమా కు కమిట్ అయ్యాడు అంటూ టాలీవుడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.2023 చివర్లో లేదా 2024 లో కాని వీరి కాంబో పట్టాలెక్కే అవకాశం ఉంది.ప్రభాస్ తో సినిమా కోసం దిల్ రాజు ఇప్పటికే మూడు నాలుగు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు.ఇప్పుడు మరో రెండు మూడు ఏళ్ల పాటు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు.