యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం తన కెరీర్లో 20వ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.బాహుబలి, సాహో తరువాత ప్రభాస్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా ఎలా ఉంటుందా అనే ఆసక్తి ఆయన ఫ్యాన్స్తో పాటు ప్రేక్షకుల్లో మొదలైంది.
ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ తనలోని రొమాంటిక్ యాంగిల్ను రెచ్చిపోయి చూపించేందుకు రెడీ అవుతున్నాడు.
ఈ సినిమాలో ప్రభాస్ లవ్ స్టోరీ హైలైట్గా తెరకెక్కించేందుకు దర్శకుడు రాధాకృష్ణ ప్రయత్నిస్తున్నాడు.
ఈ క్రమంలో అందాల భామ పూజా హెగ్డేతో ఇంటిమేట్ సీన్స్లో నటించనున్నట్లు తెలుస్తోంది.దీనికి సంబంధించిన షూటింగ్ను రామోజీ ఫిలిం సిటీలో ఏర్పాటు చేసిన ఓ రొమాంటిక్ సెట్లో జరిపినట్లు తెలుస్తోంది.
ప్రభాస్, పూజాల మధ్య కేవలం లిప్లాక్లతో మమ అనిపించకుండా, చాలా లోతైన రొమాన్స్ను పండించేందుకు డైరెక్టర్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
ఏదేమైనా డార్లింగ్ ప్రభాస్ చాలా కాలం తరువాత తన ఫ్యాన్స్ను రొమాన్స్తో కట్టిపడేసేందుకు రెడీ అవుతున్నాడనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా ఈ సినిమాను రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తుండగా యువీ క్రియేషన్స్తో పాటు రెబెల్ స్టార్ కృష్ణం రాజు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాడు.