యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా నాలుగు సినిమాలని భారీ బడ్జెట్ తో చేస్తున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం రాధేశ్యామ్ మూవీ కంప్లీట్ దశలో ఉండగా ఓం రౌత్ దర్శకత్వంలో డైరెక్ట్ హిందీ ఎంట్రీ మూవీ ఆది పురుష్ షూటింగ్ దశలో ఉంది.
ఈ మూవీలో శ్రీరాముడు పాత్రలో ప్రభాస్ కనిపించబోతున్న సంగతి తెలిసిందే.ఇక ప్రశాంత్ నీల్ సలార్ లో గ్యాంగ్ స్టార్ గా కనిపిస్తున్నాడు.
నాగ్ అశ్విన్ తెరకెక్కించబోయే సైన్స్ ఫిక్షన్ మూవీలో ప్రభాస్ ఎలాంటి పాత్రలో కనిపిస్తాడు అనేదానిపై ఎలాంటి క్లారిటీ లేదు.ఈ మూడు సినిమాలు కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ స్ట్రైట్ హిందీ మూవీని సిద్దార్ద్ ఆనంద్ దర్శకత్వంలో ప్రభాస్ చేయనున్న సంగతి తెలిసిందే.
ఇక మూవీ యాక్షన్ థ్రిల్లర్ గా ఉండబోతుందనే టాక్ బిటౌన్ లో వినిపిస్తుంది.ప్రస్తుతం సిద్దార్ద్ ఆనంద్ షారుఖ్ ఖాన్ తో పఠాన్ మూవీ చేస్తున్నాడు.
ఈ మూవీ కంప్లీట్ అయిన తర్వాత హిందీలో మరో హీరోతో ఒక మూవీ కంప్లీట్ చేసుకొని ప్రభాస్ తో చేయబోయే ప్రాజెక్ట్ పైకి రానున్నాడు.ఇదిలా ఉంటే ప్రభాస్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో చేయబోయే సినిమాలో ఏజెంట్ కనిపించబోతున్నట్లు బీ టౌన్ లో టాక్ వినిపిస్తుంది.ఈ సినిమాలో భారీ యాక్షన్ తో పాటు, ప్రేక్షకులకు ఆసక్తి కలిగించే అంశం కూడా ఉండబోతుందని సమాచారం.ఏకంగా 250 కోట్ల భారీ బడ్జెట్తో ఈ మూవీని నిర్మించబోతున్నట్లు తెలుస్తుంది.
పాన్ ఇండియా రేంజ్ లోనే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఈ మూవీకి హాలీవుడ్ సాంకేతిక నిపుణులు పని చేసే అవకాశం ఉందని బిటౌన్ లో చెప్పుకుంటున్నారు.ఆది పురుష్ మూవీపై కూడా ప్రస్తుతం బిటౌన్ లో జోరుగా చర్చ నడుస్తుంది.