యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సలార్.ఈ మూవీ మొదటి షెడ్యూల్ ఇప్పటికే పూర్తయింది.
ఇక సెకండ్ షెడ్యూల్ కోసం రెడీ అవుతున్న సమయంలోనే కరోనా ప్రభావం వలన వాయిదా పడింది.ఇదిలా ఉంటే ఈ సినిమాలో ప్రభాస్ ఒక మాఫియా డాన్ దగ్గర పని చేసే వ్యక్తిగాగా కనిపిస్తాడని ముందుగానే దర్శకుడు ప్రశాంత్ కథని రివీల్ చేశాడు.
డాన్ సైన్యంలో పని చేస్తూ డాన్ స్థాయికి ఎలా ఎదిగాడు అనే కాన్సెప్ట్ తోనే సినిమా ఉంటుందని కూడా స్పష్టం చేశాడు.అయితే ఈ సినిమా కథ విషయంలో ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇచ్చిన తర్వాత రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
కన్నడలో ప్రశాంత్ నీల్ చేసిన మొదటి సినిమా రీమేక్ గా దీనిని తెరకెక్కిస్తున్నారని ప్రచారం చేశారు.తరువాత అలాంటిదేం లేదని క్లారిటీ వచ్చింది.
ఇప్పుడు మరో ఆసక్తికరమైన వార్త ప్రచారంలో ఉంది.ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ లో కనిపిస్తాడని టాక్ నడుస్తుంది.అందులో తండ్రి పాత్రలో ప్రభాస్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపిస్తాడని చర్చ మొదలైంది.కొడుకు పాత్రలో ప్రభాస్ మాఫియా డాన్ గా మారుతాడని చెప్పుకుంటున్నారు.
తండ్రి కొడుకుల ఘర్షణ, ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా కథాంశం ఉంటుందని, సినిమాకి ఎమోషనల్ కాన్ ఫ్లిక్ట్ కూడా తండ్రి, కొడుకుల డ్రామానే అని గట్టి ప్రచారం వినిపిస్తుంది.మరి ఇందులో వాస్తవం ఎంత అనేది దర్శకుడు ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.
ఇక సినిమాలో కథానాయికగా శృతి హాసన్ కనిపించబోతున్న సంగతి తెలిసిందే.ఆమె పాత్ర కూడా చాలా ఇంటెన్సిటీతో ఉంటుందని టాక్.