యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోండగా, ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
ఇక ఈ సినిమాను జిల్ ఫేం దర్శకుడు రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.కాగా ఈ సినిమాను పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా దర్శకుడు తీర్చిదిద్దుతున్నాడు.
ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇటీవల రిలీజ్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
కాగా దక్షిణాది నుండి పాన్ ఇండియా చిత్రం అంటే కేవలం ప్రభాస్ పేరు మాత్రమే ముందుగా వస్తుండటంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫులు ఖుషీ చేసుకుంటున్నారు.అటు ప్రభాస్ నటించనున్న నెక్ట్స్ చిత్రం కూడా భారీ పాన్ ఇండియా మూవీగా రానుండటంతో ప్రేక్షకులు ఆ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే టాలీవుడ్లో ఇతర హీరోలు కూడా పాన్ ఇండియా మూవీలను తెరకెక్కిస్తున్నా, తొలుత ప్రభాస్ పేరు మాత్రమే వినిపిస్తుండటంతో ప్రభాస్ అంటేనే పాన్ ఇండియా చిత్రాలకు కేరాఫ్గా మారిపోయాడని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.ఇక పాన్ ఇండియా చిత్రాలను భారీ బడ్జెట్తో తెరకెక్కించేలా చేసింది కూడా ప్రభాస్ అని వారు అంటున్నారు.
కాగా రాధేశ్యామ్ చిత్రంతో ప్రభాస్ మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.