యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాదే శ్యామ్ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు.పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది.
ఈ సినిమాతో మరో సాయి ఇండియా మొత్తం తన హవా చూపించాలని ప్రభాస్ భావిస్తున్నారు.ఇప్పటికే బాహుబలి, సాహో సినిమాలతో సత్తా చాటిన ప్రభాస్ తనని తాను ఇండియన్ హీరో అని ప్రూవ్ చేసుకోవడానికి మరో అవకాశంగా ఈ సినిమా ఉండబోతుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత ప్రభాస్ ఎవరితో సినిమా చేస్తాడు అనే టాక్ టాలీవుడ్ లో వినిపిస్తుంది.
ఇప్పుడు ఊహించని విధంగా తెరపైకి కొరటాల శివ పేరు వచ్చింది.
ఇప్పటికే ప్రభాస్ నెక్స్ట్ సినిమాకి అతను కథ చెప్పడం, దానిని ప్రభాస్ ఒకే చెప్పడం జరిగిపోయిందని టాక్ వినిపిస్తుంది.ప్రస్తుతం కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవి సినిమాని తెరకెక్కిస్తున్నారు.
ఇది పూర్తయ్యి రిలీజ్ అయిన వెంటనే ప్రభాస్ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నాడని సమాచారం.ఇప్పటికే వరుస హిట్స్ తో స్టార్ దర్శకుడుగా ఉన్న కొరటాల శివకి చిరంజీవి సినిమా కూడా హిట్ పడే అవకాశం ఉంది.
మరి తర్వాత ప్రభాస్ తో తెరకెక్కించే సినిమాని పాన్ ఇండియా మూవీగానే ఆవిష్కరిస్తారా లేక తెలుగుకి మాత్రమే పరిమితం చేస్తారా అనేది చూడాలి.