యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఇప్పటికే మెజారిటీ శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను దర్శకుడు రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
ఇక ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నాడు.కాగా ఈ సినిమా తరువాత ప్రభాస్ మరో రెండు భారీ ప్రాజెక్టులను లైన్లో పెడుతున్న సంగతి తెలిసిందే.
తన నెక్ట్స్ మూవీగా దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ఓ సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్న ప్రభాస్, ఆ తరువాత బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావుత్ డైరెక్షన్లో ఆదిపురుష్ అనే సినిమాలో నటించేందుకు రెడీ అయ్యాడు.ఇలా మూడు భారీ బడ్జెట్ చిత్రాలను లైన్లో పెట్టిన ప్రభాస్, వాటితో ఎలాంటి రిజల్ట్న అందుకుంటాడా అని ఆయన అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.
అయితే ప్రభాస్పై ఎలాంటి డౌట్ లేని కొందరు అభిమానులు, ఆయన చేయబోయే దర్శకులపై మాత్రం సందేహంగా ఉన్నారు.ఆయన చేయబోతున్న ముగ్గురు డైరెక్టర్లు కూడా ప్రేక్షకుల్లో పెద్దగా క్రేజ్ లేని వారే దీనికి కారణం.
రాధాకృష్ణ చేసిన జిల్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ కావడంతో ఆయన రాధేశ్యామ్ను ఎలా తీర్చిదిద్దుతాడా అనే సందేహం అందరిలో నెలకొంది.ఇక మహానటి చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్, స్టార్ హీరోలతో సినిమాలు చేయకపోవడంతో ప్రభాస్తో చిత్రాన్ని ఎలా హ్యాండిల్ చేస్తాడా అని అందరూ అనుకుంటున్నారు.
ఇక బాలీవుడ్ దర్శకుడు ఓం రావుత్ గురించి తెలుగు ప్రేక్షకులకు అసలే తెలియదు.దీంతో ఆదిపురుష్ చిత్రం ఎలా ఉండబోతుందా అనే సందేహం వారిలో నెలకొంది.
మొత్తానికి ప్రభాస్ చేస్తున్న మూడు పెద్ద సినిమాల భవిష్యత్తు ఇప్పుడు ఆయా డైరెక్టర్ల చేతుల్లో ఉండటంతో ప్రభాస్ ఫ్యాన్స్లో తీవ్ర ఆందోళన నెలకొంది.