బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యాడు ప్రభాస్.ఈ సినిమాతో తన మార్కెట్ కూడా పెంచుకున్నాడు.
అందుకే వరస పెట్టి పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు.ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా షూటింగ్ పూర్తి చేసి విడుదలకు సిద్ధంగా ఉంచాడు.
ఈ సినిమా తర్వాత ప్రభాస్ మరొక మూడు సినిమాలు ప్రకటించాడు.
కేజిఎఫ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా ప్రకటించాడు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.ఈ సినిమా టైటిల్ కూడా అనౌన్స్ చేసారు.
ఈ సినిమాకు సలార్ టైటిల్ ను ఫిక్స్ చేసారు.ఈ సినిమాతో పాటు ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా ప్రకటించాడు.
ఈ సినిమాకు ఆదిపురుష్ అనే టైటిల్ ఫిక్స్ చేసారు.
ఆదిపురుష్ సినిమా రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతుంది.ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా నటిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతుంది.
ఈ సినిమాను విజువల్ వండర్ గా తెరకెక్కిస్తున్నారు.టి సిరీస్ సంస్థ 500 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమాతో పాటు ప్రభాస్ నాగ్ అశ్విన్ తో కూడా ఒక సినిమా ప్రకటించాడు.
ఇది ఇలా ఉండగా ఇప్పుడు మరొక డైరెక్టర్ ను లైన్లో పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి.
మాస్టర్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తో ఒక సినిమా చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.ఈయన ఇప్పటికే ప్రభాస్ కు స్టోరీ లైన్ కూడా వినిపించాడని ఆ స్టోరీ లైన్ ప్రభాస్ కు బాగా నచ్చిందని ఓకే కూడా చెప్పాడని వార్తలు వస్తున్నాయి.
మరి ఈ వార్తలో నిజమెంతో వేచి చూడాలి.