టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.అయితే ఈ చిత్రంలో ప్రభాస్ కి జంటగా టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే నటిస్తోంది.
కాగా ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు కేకే రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ యు.వి.క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది.
అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు చిత్ర యూనిట్ సభ్యులు సోషల్ మీడియా మాధ్యమాలలో విడుదల చేశారు.
దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నప్పటికీ మరికొంతమంది మాత్రం ఈ చిత్ర పోస్టర్లు అప్పట్లో టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించినటువంటి కంచె చిత్ర పోస్టర్లను పోలి ఉన్నాయని తెగ కామెంట్లు చేస్తున్నారు.మరికొంతమంది గతంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ ప్రముఖ రాజకీయ నాయకుడు తన భార్యతో దిగినటువంటి ఫోటోని చూసి కాపీ చేశారంటూ ట్రోల్స్ చేస్తున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా బాహుబలి సినిమా తర్వాత ఇప్పటివరకు ప్రభాస్ మళ్ళీ తన తదుపరి చిత్రం గురించి ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు.దీంతో మొదట్లో ప్రభాస్ అభిమానులు కొంతమేర నిరాశకు గురైనప్పటికీ రాధే శ్యామ్ చిత్ర పోస్టర్ విడుదల చేయడంతో కొంత మేర ఊపిరి పీల్చుకున్నారు.
అంతేగాక అంచనాలు కూడా బాగానే పెట్టుకుంటున్నారు.మరి ప్రభాస్ రాధే శ్యామ్ తో తన అభిమానులను ఎలా అలరిస్తాడో చూడాలి.