సాహో చిత్రం తర్వాత రాధకృష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తున్న ప్రభాస్ తదుపరి చిత్రాన్ని మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెల్సిందే.భారీ అంచనాలున్న ఆ సినిమాను ఈ ఏడాది చివర్లో ప్రారంభించి వచ్చే ఏడాదిలో విడుదల చేయాలని భావించారు.
అయితే దర్శకుడి ప్లాన్ వర్కౌట్ అయ్యేలా లేదు. వచ్చే ఏడాదిలో సినిమా విడుదల సాధ్యం కాకపోవచ్చు అంటున్నారు.
కరోనా కారణంగా మొత్తం షెడ్యూల్స్ గందరగోళంగా మారిపోయాయి.
ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్కువ శాతం మంది ఈ సినిమా కోసం కళ్లు కాయలు కాసేలా ఇప్పటి నుండే ఎదురు చూస్తూ ఉంటే కొందరు మాత్రం ఈ సినిమాపై అప్పుడే అనుమానాలు పెట్టుకుంటున్నారు.
ఈ చిత్రాన్ని అశ్వినీదత్ వైజయంతి మూవీస్ పతాకంపై నిర్మించబోతున్నాడు.ఈ బ్యానర్లో ఈమద్య కాలంలో భారీ బడ్జెట్తో నిర్మించిన సినిమాలన్నీ కూడా నిరాశ పర్చాయి.ముఖ్యంగా శక్తి చిత్రం దారుణమైన డిజాస్టర్గా నిలిచింది.అట్టర్ ఫ్లాప్స్కు బాప్ మాదిరిగా మారింది.
శక్తి సినిమా సోషియో ఫాంటసీ సినిమా అనే విషయం తెల్సిందే.ఇప్పుడు ప్రభాస్తో నాగ్ అశ్విన్ చేయబోతున్నది కూడా అదే. కనుక శక్తి తరహా ఫలితం పునరావృతం అవుతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.కాని కొందరు మాత్రం ఈ సినిమాపై చాలా నమ్మకం పెట్టుకున్నారు.
జగదేక వీరుడు అతిలోక సుందరి రేంజ్లో ఈ సినిమా ఉంటుందనే నమ్మకంతో ఎదురు చూస్తున్నారు.మరి ఎవరి నమ్మకం ఎలా ఉంటుందో చూడాలి.