ప్రభాస్ హీరోగా రూపొందబోతున్న నాగ్ అశ్విన్ చిత్రం గురించిన రోజో అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఆ వార్తలు ప్రభాస్ ఫ్యాన్స్లో అంచనాలు పెంచేస్తోంది.
నిన్న మొన్న ఈ సినిమాకు ఏఆర్ రహమాన్ సంగీతం అందించబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి.కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంకు కీరవాణి సంగీతాన్ని అందించబోతున్నాడట.
రహమాన్ కంటే కూడా అధికంగా ఈ చిత్రంకు కీరవాణి అయితే న్యాయం చేస్తాడనే నమ్మకంను నాగ్ అశ్విన్ వ్యక్తం చేస్తున్నాడు.
రాజమౌళి వరుసగా చేస్తున్న చిత్రాలకు పెద్దన్న కీరవాణితో సంగీతాన్ని చేయిస్తున్నాడు.
తనకు తగ్గట్లుగా కీరవాణి సంగీతాన్ని అందిస్తాడనే నమ్మకంను జక్కన్న కలిగి ఉన్నాడు.ప్రస్తుతం ఆయన తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంకు కూడా కీరవాణి సంగీతంను అందిస్తున్నాడు.
అందుకే తన సినిమాకు కూడా కీరవాణిని ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది.సైన్స్ పిక్షన్ మూవీ అవ్వడంతో ఈ సినిమా చాలా విభిన్నంగా ఉంటుంది.
అందుకు రహమాన్ సంగీతం కంటే కూడా అధికంగా కీరవాణి సంగీతం సెట్ అవుతుందని నాగ్ అశ్విన్ భావిస్తున్నాడు.
సైన్స్ ఫిక్షన్ మూవీలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.ఆ విషయం మరియు సంగీత దర్శకుడి విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.త్వరలోనే ఈ రెండు విషయాలపై నాగ్ అశ్విన్ క్లారిటీ ఇస్తే బాగుంటుంది అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
హాలీవుడ్ టెక్నీషియన్స్ను ఈ చిత్రంకు గాను ఉపయోగిస్తున్న నాగ్ అశ్విన్ కీరవాణితో వర్క్ చేసేందుకు సిద్దం అవ్వడం కాస్త ఆశ్చర్యకర విషయమే.