డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమా చేస్తున్నాడు.దీని తర్వాత నాగ్ అశ్విన్ సినిమాతో సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు.
ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైంది.డిసెంబర్ నెలలో సినిమాని ప్రారంభించే అవకాశం ఉంది.
ఇక ఇందులో ప్రభాస్ కి జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునేని ఫైనల్ చేశారు.ఇక ఇందులో ఆమె ఒక డాన్సర్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.
ఇదిలా ఉంటే సైన్స్ ఫిక్షన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం సుమారు నాలుగు వందల కోట్లు బడ్జెట్ పెట్టబోతున్నారు.ఇక సినిమాని ఇండియన్ హాలీవుడ్ మూవీగా ఆవిష్కరించే ప్రయత్నం దర్శకుడు నాగ్ అశ్విన్ చేస్తున్నాడు.
ఇండియన్ భాషలతో పాటు విదేశీ భాషలలో కూడా సినిమాని రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.ఇక ఈ సినిమా కథ, కథనం అంతా టైం ట్రావెల్ లో ఫ్యూచర్ కాన్సెప్ట్ గా ఉంటుందని సమాచారం.
ముఖ్యంగా మూడో ప్రపంచ యుద్ధం నేపధ్యంలో సినిమా కథ నడుస్తుందని.ఫ్యూచర్ లో ప్రపంచం ఎలా ఉంటుంది అనే ఊహాజనితంగా ఫిక్షన్ ఎలిమెంట్స్, అప్పటి వాతావరణం క్రియేట్ చేసి సినిమా షూట్ చేస్తారని టాక్.
ఇక ప్రభాస్ ఈ సినిమాలో ఒక యుద్ధ సైనికుడుగా కనిపిస్తాడని తాజాగా ఒక అప్డేట్ చిత్ర పరిశ్రమలో వినిపిస్తుంది.సినిమా మొత్తం గ్రాఫిక్స్ తో విజువల్ వండర్ గా ఉంటుందని, ప్రేక్షకులని భవిష్యత్తులోకి తీసుకెళ్లే కథ కావడంతో అందుకు తగ్గట్లుగానే విజువలైజేషన్ అంతా ఉంటుందని సమాచారం.
దీనికోసం నాగ్ అశ్విన్ ఇప్పుడు స్టోరీ బోర్డు రెడీ చేస్తున్నట్లు తెలుస్తుంది.ఇక సినిమా గురించి పూర్తి వివరాలు తెలియకున్న తాజాగా బయటకి వస్తున్న అప్డేట్ బట్టి చూస్తే ఈ సినిమాతో ప్రభాస్ ఇంటర్నేషనల్ స్టార్ గా మారిపోవడం గ్యారెంటీ అనే మాట బలంగా వినిపిస్తుంది.