మల్టీస్టారర్ మూవీలో ప్రభాస్.. ఇంకో హీరో ఎవరో తెలుసా?
TeluguStop.com
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తనదైన మార్క్ వేసుకునేందుకు ప్రభాస్ రెడీ అయ్యాడు.
ఇక ఈ సినిమాతో ప్రభాస్ మరోసారి పాన్ ఇండియా వైడ్గా బ్లాక్బస్టర్ను అందుకునేందుకు రెడీ అవుతున్నాడు.
కాగా ఈ సినిమాను పూర్తి పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.
ఇక ఈ సినిమా తరువాత ప్రభాస్ తన నెక్ట్స్ చిత్రాలను కూడా లైన్లో పెట్టే పనిలో పడ్డాడు.
ఈ క్రమంలో ప్రభాస్, తన నెక్ట్స్ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ డైరెక్షన్లో తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడు.
ఇక ఈ సినిమా తెరకెక్కకముందే మరో సినిమాను ఓకే చేసే పనిలో పడ్డాడు.
బాలీవుడ్కు చెందిన ఓ స్టార్ డైరెక్టర్ ప్రభాస్తో ఓ పాన్ ఇండియా మూవీ తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు.
కాగా ఈ డైరెక్టర్ కథలో ఇద్దరు హీరోలు ఉంటారట.అందుకోసమే ఈ సినిమాను మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కించాలని, మరో హీరోగా బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటిస్తాడనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే సినిమా అనౌన్స్ అయ్యే వరకు ఆగాల్సిందే.
ఇక ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా అని అందరూ అప్పుడే ఆసక్తిగా చూస్తున్నారు.
కాగా రాధేశ్యామ్ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్ల రిలీజ్ గురించి చిత్ర యూనిట్ తాజాగా అనౌన్స్ చేసింది.
టీ తో పాటుగా అసలు కలిపి తీసుకోకూడని ఆహారాలు ఇవే..!