యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహో తరువాత చేస్తున్న చిత్రం ప్రస్తుతం శరవేగంగా సూటింగ్ జరుపుకుంటోంది.ఈ సినిమాను జిల్ ఫేం దర్శకుడు రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు.
కాగా ఈ సినిమా తరువాత ప్రభాస్ మరో సినిమాను లైన్లో పెట్టాడు.మహానటి చిత్రంతో జాతీయ గుర్తింపు పొందిన నాగ్ అశ్విన్తో కలిసి ప్రభాస్ తన నెక్ట్స్ మూవీని రెడీ చేసేందుకు రెడీ అవుతున్నాడు.
అయితే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ చిత్ర యూనిట్ తాజాగా చేశారు.
ఈ సినిమా షూటింగ్ను 2020 చివరినాటికి మొదలుపెట్టేందుకు ప్రభాస్ అండ్ టీమ్ రెడీ అవుతున్నారు.
ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది చివరికల్లా రిలీజ్ చేసేందుకు వారు ప్లాన్ చేస్తున్నారు.కాగా అది ఎంతవరకు సాధ్యం అవుతుందనే అంశం మాత్రం అటు ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో నెలకొంది.
ప్రభాస్ ఈ మధ్య తన సినిమాలు పూర్తి చేసేందుకు చాలా సమయం తీసుకుంటున్నాడు.బాహుబలి చిత్రం దగ్గర నుండి ప్రభాస్ ఒక్క సినిమాకు కనీసం రెండేళ్లు తీసుకుంటున్నాడు.
దీంతో నాగ్ అశ్విన్ సినిమా కూడా 2021లో వస్తుందో లేదో అనే సందేహం అందరిలో నెలకొంది.
ఇక ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్పై భారీ బడ్జెట్తో తెరకెక్కించేందుకు నిర్మాతలు రెడీ అవుతుండటంతో, ఈ సినిమా కూడా చాలా సమయం తీసుకోవడం ఖాయమని తెలుస్తోంది.
మరి ప్రభాస్ తన తీరును ఎప్పుడు మార్చుకుంటాడా, ఎప్పుడు సినిమాలను త్వరగా పూర్తి చేసి తక్కువ సమయంలో రిలీజ్ చేస్తాడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.