తీరు మార్చని ప్రభాస్.. అవాక్కవుతున్న ఫ్యాన్స్!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహో తరువాత చేస్తున్న చిత్రం ప్రస్తుతం శరవేగంగా సూటింగ్ జరుపుకుంటోంది.ఈ సినిమాను జిల్ ఫేం దర్శకుడు రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు.

 Prabhas Nag Ashwin Movie Release In Dilemma-TeluguStop.com

కాగా ఈ సినిమా తరువాత ప్రభాస్ మరో సినిమాను లైన్‌లో పెట్టాడు.మహానటి చిత్రంతో జాతీయ గుర్తింపు పొందిన నాగ్ అశ్విన్‌తో కలిసి ప్రభాస్ తన నెక్ట్స్ మూవీని రెడీ చేసేందుకు రెడీ అవుతున్నాడు.

అయితే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చిత్ర యూనిట్ తాజాగా చేశారు.

ఈ సినిమా షూటింగ్‌ను 2020 చివరినాటికి మొదలుపెట్టేందుకు ప్రభాస్ అండ్ టీమ్ రెడీ అవుతున్నారు.

ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది చివరికల్లా రిలీజ్ చేసేందుకు వారు ప్లాన్ చేస్తున్నారు.కాగా అది ఎంతవరకు సాధ్యం అవుతుందనే అంశం మాత్రం అటు ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో నెలకొంది.

ప్రభాస్ ఈ మధ్య తన సినిమాలు పూర్తి చేసేందుకు చాలా సమయం తీసుకుంటున్నాడు.బాహుబలి చిత్రం దగ్గర నుండి ప్రభాస్ ఒక్క సినిమాకు కనీసం రెండేళ్లు తీసుకుంటున్నాడు.

దీంతో నాగ్ అశ్విన్ సినిమా కూడా 2021లో వస్తుందో లేదో అనే సందేహం అందరిలో నెలకొంది.

ఇక ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు నిర్మాతలు రెడీ అవుతుండటంతో, ఈ సినిమా కూడా చాలా సమయం తీసుకోవడం ఖాయమని తెలుస్తోంది.

మరి ప్రభాస్ తన తీరును ఎప్పుడు మార్చుకుంటాడా, ఎప్పుడు సినిమాలను త్వరగా పూర్తి చేసి తక్కువ సమయంలో రిలీజ్ చేస్తాడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube