ప్రభాస్ బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు.ఈ సినిమా తర్వాత వరస పెట్టి పాన్ ఇండియా సినిమాలు చేస్తూ దూకుడుగా వ్యవహరిస్తున్నాడు.
ప్రస్తుతం రాధే శ్యామ్ సినిమా పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంచారు.రాధే శ్యామ్ సినిమాలో ప్రభాస్ కు జంటగా పూజ హెగ్డే నటిస్తున్నారు.
ఈ సినిమాను జులై 30 న విడుదల చేయబోతున్నారు.
రాధే శ్యామ్ సినిమా తర్వాత సలార్, ఆది పురుష్ సినిమాలు ప్రకటించి ఇప్పటికే షూటింగ్ కూడా ప్రారంభించేసారు.
ప్రభాస్ సలార్ సినిమాను కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు.ప్రశాంత్ నీల్ ఈ సినిమాను ఉగ్రం సినిమాకు రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తుంది.ఆదిపురుష్ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఆదిపురుష్ సినిమా రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతుంది.ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా నటిస్తున్నారు.ఈ సినిమాను విజువల్ వండర్ గా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను టి సిరీస్ సంస్థ 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుండగా 60 శాతం బడ్జెట్ గ్రాఫిక్స్ కోసమే ఉపయోగిస్తున్నారని సమాచారం.
ఈ సినిమాను వచ్చే సంవత్సరం ఆగస్టు 11 న విడుదల చేయాలనీ చిత్ర యూనిట్ భావిస్తున్నారు.
అయితే ఈ రెండు సినిమాల కన్నా ముందుగా ప్రకటించిన నాగ్ అశ్విన్ సినిమా మాత్రం ఇంకా మొదలు పెట్టలేదు.ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా దీపికా పదుకొనె నటించబోతుంది.ఈ సినిమాను నాగ్ అశ్విన్ సోషియో ఫాంటసీ కథతో తెరకెక్కించబోతున్నారు.
అయితే ఈ సినిమా లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది.ఈ సినిమాలో చాలా భాగం రామోజీ ఫిలిం సిటీలోనే జరగబోతున్నట్టు తెలుస్తుంది.
అందుకే భారీ ఖర్చు పెట్టి ఫిలిం సిటీలో సెట్స్ కూడా వేయిస్తున్నారట.ఈ సినిమా షూటింగ్ జులై లో ప్రారంభం చేయడానికి నాగ్ అశ్విన్ సన్నాహాలు చేస్తున్నారు.
ఇప్పటికే హాలీవుడ్ టెక్నీషియన్స్ ను కూడా ఇక్కడకు రప్పిస్తున్నది టాక్.ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఈ సినిమాను వైజయంతి బ్యానర్ పై తెరకెక్కించబోతున్నారు.వచ్చే సంవత్సరం చివరి కల్లా ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.