ఇటీవల తెలుగు సినిమాలు ప్రేక్షకులకు సరికొత్త ప్రపంచాన్ని చూపిస్తున్నాయి.ఈతరం యువ ప్రేక్షకులకు 1980లలో ఎలా ఉండేది పరిస్థితులు, పల్లెటూర్లలో పరిస్థితి ఎలా ఉండేది అనే విషయాలు తెలియవు.
పూర్వ కాలంలో పరిస్థితులను వరుసగా స్టార్ హీరోలు ప్రేక్షకులకు కళ్లకు కట్టినట్లుగా చూపించేందుకు సిద్దం అవుతున్నారు, ఇప్పటికే కొందరు అప్పటి జ్ఞాపకాలను నెమరవేసుకునేలా చేశారు.ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన రంగస్థలం చిత్రం 1980 నేపథ్యంలో తెరకెక్కి అప్పటి పరిస్థితులను కళ్లకు కట్టడం జరిగింది.
త్వరలో మరికొన్ని చిత్రాలు కూడా కళ్లకు కట్టినట్లుగా అప్పటి పరిస్థితులను చూపించేందుకు రెడీ అవుతున్నాయి.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ ‘జిల్’ చిత్ర దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేయబోతున్నాడు.ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్వర్క్ జరుగుతుంది.1970లలో జరిగే ప్రేమ కథను రాధాకృష్ణ చూపించబోతున్నాడు.అప్పట్లో ప్రేమ కథ ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలో వ్యక్తం అవుతుంది.యూవీ క్రియేషన్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.1970 నేపథ్యంను చూపించేందుకు దర్శకుడు రాధాకృష్ణ భారీ సెట్టింగ్లను వేయిస్తున్నాడు.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.
ప్రభాస్ ప్రస్తుతం ‘సాహో’ చిత్రంలో నటిస్తున్నాడు.వచ్చే సంవత్సరంలో ఆ సినిమా విడుదల కాబోతుంది.ప్రభాస్, రాధాకృష్ణల మూవీ ఈ సంవత్సరం చివర్లో ప్రారంభం అయ్యే అవకాశం కనిపిస్తుంది.ఫ్ల్యాష్ బ్యాక్లోకి ప్రభాస్ తీసుకు వెళ్లబోతున్న నేపథ్యంలో సినిమాపై అప్పుడే అంచనాలు ఆకాశాన్ని తాకేలా వస్తున్నాయి.
అంచనాలకు తగ్గట్లుగా చిత్రాన్ని భారీ ఎత్తున తెరకెక్కించాలని యూవీ క్రియేషన్స్ నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.అందరి అంచనాలను అందుకునేలా సినిమా ఉండేలా రాధాకృష్ణ ప్రయత్నాలు చేస్తున్నాడు.
ప్రభాస్తో పాటు శర్వానంద్, నాని, సాయి పల్లవిలు కూడా ఫ్ల్యాష్బ్యాక్లోకి తీసుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ సంవత్సరం ఆరంభంలో వచ్చిన రంగస్థలం చిత్రం ఈ చిత్రాలకు మార్గదర్శకం అని సినీ విశ్లేషకులు అంటున్నారు.
రంగస్థలంకు మంచి టాక్ వచ్చిన కారణంగానే ఇలా వరుసగా చిత్రాలు 1980 కాంలో తీస్తున్నారు.మరి రాబోతున్న చిత్రాలు ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని కలిగిస్తాయి అనేది చూడాలి.