యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ నెలలో పుట్టిన రోజు జరుపుకోబోతున్నాడు.ఆ సందర్భంగా అభిమానుల ముందుకు మూడు పుట్టిన రోజు కానుకలు రాబోతున్నట్లు గా సినీ వర్గాలలో టాక్ వినిపిస్తోంది.
ముఖ్యంగా ఈయన నటిస్తున్న రాధేశ్యామ్ సినిమాకు సంబంధించిన టీజర్ ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయట.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఇటలీ లో జరుగుతుంది.
అతి త్వరలో ఇటలీ షెడ్యూల్ ను పూర్తి చేసుకొని వచ్చిన వెంటనే ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా టీజర్ విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేయబోతున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరింది.
వచ్చే ఏడాది సమ్మర్ చివర్లో లేదా దసరాకు విడుదల అయ్యే ఛాన్సుంది.రాధేశ్యామ్ సినిమా తరువాత ప్రభాస్ నటించబోతున్న సినిమా ఆది పురుష్.బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం లో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ దాదాపుగా పూర్తయింది.జనవరిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.
ఈ సినిమాకు సంబంధించిన కీలక సమాచారంప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ప్రేక్షకులకు అందించే విషయమై దర్శకుడు ప్రయత్నాలు చేస్తున్నాడు.ఇప్పటికే ప్రభాస్ తో ఓం రౌత్ ఫోటో షూట్ చేశారు.
ఆ ఫొటో షూట్ నుండి ఒక స్టిల్ ను బర్త్ డే సందర్భంగా విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు.ఇక చివరగా నాగ్ అశ్విన్ దర్శకత్వం లో రూపొందుతున్న ఓ సినిమాలో కూడా ప్రభాస్ నటిస్తున్న విషయం తెలిసిందే.
అందుకు సంబంధించిన అప్డేట్ కూడా పుట్టిన రోజు సందర్భంగా వచ్చే అవకాశం ఉందట.
ఈ మూడు పుట్టిన రోజు సర్ ప్రైజ్ లతో ఆ రోజు సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ హడావుడి చేసే అవకాశం ఉంది.
ఆలిండియా స్టార్డమ్ దక్కించుకున్న ప్రభాస్ ఈ మూడు సినిమాలు వెయ్యి కోట్ల బడ్జెట్ తో చేస్తున్నాడు.ఇవి మొత్తం కలిపి ఇరవై ఐదు వందల కోట్ల రూపాయలను వసూలు చేస్తాయి అంటూ అభిమానులు మరియు ప్రేక్షకులు నమ్మకంగా ఎదురు చూస్తున్నారు.
రాధేశ్యామ్ 2021లో విడుదల కానుండగా మిగిలిన రెండు సినిమాలు 2022 వ సంవత్సరంలో విడుదల కాబోతున్న ట్లుగా అధికారికంగా ఇప్పటికే ప్రకటన వచ్చింది.