యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.ఈ సినిమాతో ప్రభాస్ మరోసారి తన సత్తాను చాటాలన చూస్తున్నాడు.
ఇప్పటికే బాహుబలి, సాహో చిత్రాలతో ప్రభాస్ రేంజ్ ఏమిటో అందరికీ తెలిసింది.కాగా ఈ సినిమాతో ప్రభాస్ మరోసారి తన ప్రతాపాన్ని చూపించాలని చూస్తున్నాడు.
ఇక ప్రభాస్ 21వ చిత్రంగా దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
ఈ సినిమాలో ప్రభాస్ కొత్త గెటప్లో మనకు దర్శనమిస్తాడని చిత్ర యూనిట్ అంటోంది.కాగా ఈ సినిమాను అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కించాలని చిత్ర యూనిట్ భావిస్తుంది.
ఈ క్రమంలో ఈ సినిమాలో గ్రాఫిక్స్ పనులను భారీ స్థాయిలో పెట్టేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో ఏమాంత్ర ప్రభాస్ స్థాయికి తగ్గకుండా గ్రాఫిక్స్ను పెట్టాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.
ఈ క్రమంలో కేవలం గ్రాఫిక్స్ కోసమే ఈ సినిమాలో రూ.50 కోట్ల మేర బడ్జెట్ను కేటాయించనున్నారట నిర్మాత అశ్వనీదత్.ప్రభాస్ కోసం ఈమాత్రం బడ్జెట్ కేటాయించకపోతే ఎలా అని ఆయన అంటున్నారు.మొత్తానికి ప్రభాస్ చిత్రం భారీ బడ్జెట్ సినిమాకు ఏమాత్రం తక్కువ కాకుండా రిలీజ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
మరి ఈ సినిమాతో ప్రభాస్ టాలీవుడ్లో ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.