టాలీవుడ్ లో ప్రస్తుతం బాలీవుడ్ హీరోలకు ఉన్నంత క్రేజ్ అందుకుంటూ ఓ రేంజ్ లో దూసుకుపోతున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి అందరికీ తెలిసిందే.తన నటనతో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకొని ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.
వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంటూ బాగా బిజీగా మారాడు.చాలా వరకు మంచి మంచి హిట్ లను అందుకున్నాడు ప్రభాస్.
ఇదిలా ఉంటే ప్రభాస్ గురించి తన తల్లి బాగా బెంగ పెట్టుకుందట.ఇంతకు ఏ విషయంలోనో తెలుసుకుందాం.
ప్రభాస్ టాలీవుడ్ ఇండస్ట్రీకి 2002లో ఈశ్వర్ సినిమాతో అడుగు పెట్టాడు.ఆ తర్వాత రాఘవేంద్ర, వర్షం వంటి పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు అందుకున్నాడు.ఇక ఈ సినిమాలతో మంచి హిట్ సొంతం చేసుకున్నాడు.అలా పలు సినిమాలలో నటించాక పాన్ ఇండియా మూవీ బాహుబలి సినిమాతో ఎనలేని క్రేజ్ సంపాదించుకున్నాడు.
ఈ సినిమా తర్వాత మొత్తం పాన్ ఇండియా సినిమాలకే అలవాటు పడుతున్నాడు ప్రభాస్.అంతేకాకుండా దర్శకులు కూడా ప్రభాస్ కోసం పాన్ ఇండియా సినిమాలనే తెస్తున్నారు.ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలతోనే బిజీగా ఉన్నాడు.ఇదిలా ఉంటే ప్రభాస్ గురించి తన తల్లి శివకుమారి బెంగ పెట్టుకున్నట్లు తెలుస్తుంది.
ఇంతకు అదే విషయం లోనో ఈ పాటికే మీకు అర్థం కావచ్చు.ఇంకేంటి. ప్రభాస్ పెళ్లి గురించే తన తల్లి బాధ పడుతుందట.కేవలం తన కుటుంబ సభ్యులే కాదు ఆయన అభిమానులు కూడా తన పెళ్లి గురించే చింతిస్తున్నారు.
ఇప్పటికే ప్రభాస్ కు ఎన్నో సార్లు తన పెళ్లి గురించి ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యాయి.కానీ ప్రభాస్ ఎప్పుడు ఏదో ఒక విషయం చెబుతూ తప్పించుకున్నాడు.
గతంలో బాహుబలి సినిమా సమయంలో కూడా ప్రభాస్ తల్లి ప్రభాస్ గురించి బాధ పడింది.బాహుబలి 1 సినిమా విడుదలై మంచి రికార్డు సాధించగా ఆ సమయంలో ప్రభాస్ తల్లి బాగా సంతోషంగా ఉన్నానని తెలిపింది.
కానీ బాహుబలి 2 విషయంలో తాను చాలా ఆందోళన చెందింది.పార్ట్ 1 కోసం ప్రభాస్ చాలా సమయం తీసుకున్నాడు అని అందుకు పార్ట్ 2 కోసం కూడా చాలా సమయం తీసుకుంటాడేమోనని ఆందోళన చెందిందట.
దాంతో తాను ప్రభాస్ కు ఈ సినిమా కోసం రోజులు సమయం తీసుకోవద్దని తెలిపిందని తెలిసింది.ఎందుకంటే ప్రభాస్ పెళ్లి గురించే తన ఆందోళన అని తెలిపింది.బాహుబలి 2 ఎంత ఆలస్యం అయితే ప్రభాస్ పెళ్లి కూడా అంతే ఆలస్యం అవుతుందన్న బాధ తనలో ఉందని తెలిసింది.కానీ బాహుబలి 2 తర్వాత కూడా ప్రభాస్ పెళ్లి గురించి మళ్లీ ఎటువంటి టాక్ రాలేదు.
దీంతో కుటుంబ సభ్యులే కాకుండా అభిమానులు కూడా ప్రభాస్ పెళ్లి గురించి ఆలోచించడం పక్కన పెట్టేశారు.ఇక ప్రభాస్ ప్రస్తుతం సలార్, రాధేశ్యామ్, ఆది పురుష్ సినిమాలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.